IRCTC website Down: ఐఆర్‌సీటీసీ సర్వర్ డౌన్, ఒక్కసారిగి పెరిగిన ట్రాఫిక్‌తో క్రాష్ అయిన ఇండియన్ రైల్వే వెబ్‌సైట్, అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపిన రైల్వే మంత్రిత్వ శాఖ
RCTC Website Shut (Photo Credits: File Photo)

New Delhi, May 11: irctc.co.inలో టికెట్లు బుక్ చేసుకునే వారికి నిరాశ ఎదురయింది. అందరూ ఒక్కసారిగా టికెట్ బుకింగ్ కు సైటు ఓపెన్ చేయడంతో సర్వర్ ఒక్కసారిగా డౌన్ (IRCTC website Down) అయింది. ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోలేకపోతున్నామని ఫిర్యాదు చేయడానికి ట్విట్టర్‌లోకి (Twitter) వెళ్లారు. ట్విట్టర్ వేదికగా ఇండియన్ రైల్వే సైటు ఓపెన్ కావడం లేదని గగ్గోలు పెడుతున్నారు. 15 ప్యాసింజర్ రైళ్ల కోసం ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్‌లో (IRCTC Website) ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సాయంత్రం 4 నుంచి ప్రారంభించిన సంగతి విదితమే. ఈ రాజధాని రూట్లలో 15 రైళ్లు తిరుగుతాయి, తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే రైళ్ల వివరాలు, అలాగే రేపటి నుంచి పట్టాలెక్కే రైళ్ల వివరాలు, బుకింగ్ ప్రాసెస్ మీకోసం

చాలా మంది IRCTC వెబ్‌సైట్ యొక్క స్క్రీన్‌షాట్‌లను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు, ఇది తెరవడం లేదా బుకింగ్ నిలిపివేయబడిందని ఎటువంటి సమాచారం అక్కడ చూపించడం లేదు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ కుప్పకూలినట్లు తనకు సమాచారం అందిందని చెప్పారు. "రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకోవాలని చూస్తున్న స్నేహితుల నుండి @IRCTCofficial వెబ్‌సైట్ క్రాష్ అయ్యిందని నేను విన్నాను. ట్రాఫిక్ ఉప్పెనను నియంత్రించలేని వెబ్‌సైట్‌కు టికెట్ అమ్మకాలను నిర్వహించడం ఏమిటి?" అని ఒమర్ ట్వీట్ చేశారు.

Citizens Say IRCTC Website Not Working:

ఈ నేపథ్యంలో రైల్వే మంత్రిత్వ శాఖ ఒక వివరణ జారీ చేసి, త్వరలో బుకింగ్ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. "ప్రత్యేక రైళ్లకు సంబంధించిన డేటాను ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్‌లో అందిస్తున్నారు. కొద్దిసేపట్లో రైలు టికెట్ బుకింగ్‌లు లభిస్తాయి. దయచేసి వేచి ఉండండి. అసౌకర్యానికి చింతిస్తున్నాము" అని రైల్వే మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.

Railway Ministry's Clarification:

రెండు గంటలు ఆలస్యంగా ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ ప్రారంభిస్తామని రైల్వేశాఖ ప్రకటించింది. ఒకేసారి చాలామంది ఓపెన్‌ చేయడంతో వెబ్‌సైట్‌ స్లోగా పనిచేస్తోంది. ప్రస్తుతం డేటా అప్‌లోడ్‌ అవుతోందని సాయంత్రం 6 గంటల నుంచి రైల్వే టికెట్ల బుకింగ్‌ ప్రారంభిస్తామని ఐఆర్‌సీటీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే టికెట్ల బుకింగ్‌ చేసుకోవాలని సూచించింది. రైల్వేస్టేషన్లలోని కౌంటర్లలో టిక్కెట్ల జారీ ఉండదని స్పష్టం చేసింది.

మే 12 నుండి ఎసి కోచ్‌లు, పరిమిత స్టాప్‌లతో 15 జతల ప్యాసింజర్ రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. "అన్ని ప్యాసింజర్ రైళ్లు ఎసి కోచ్‌లు మరియు పరిమిత స్టాప్‌లతో మాత్రమే నడుస్తాయి. నిర్ణీత రైల్వే స్టేషన్లలోనే ఆగే ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణానికి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో మాత్రమే రిజర్వేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఐఆర్‌సీటీసీ ఏజెంట్లకూ టికెట్ల బుకింగ్‌కు అనుమతి లేదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. ఏడురోజుల ముందస్తు రిజర్వేషన్‌కు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపింది.

ఆన్‌లైన్‌లో మాత్రమే టికెట్లు రద్దు చేసుకునే అవకాశం ఉందని రైల్వేశాఖ వెల్లడించింది. ప్రయాణికులకు చిరుతిళ్లు, తాగునీరు లాంటివి పరిమితస్థాయిలో మాత్రమే ఐఆర్‌సీటీసీ అమ్మకానికి ఉంచుతుంది. రైలు ప్రయాణం చేసే ప్రయాణికులు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే నిబంధనల వివరాలు ఈ టికెట్లలో ఉంటాయని రైల్వే శాఖ పేర్కొంది. దేశంలోని వివిధ రాష్ర్టాల రాజధానులకు, ఢిల్లీకి మధ్య తిరిగే 15 మార్గాల్లో రైలు సేవలను పునరుద్ధరించనున్నట్లు రైల్వే శాఖ ఆదివారం తెలిపింది.