Mysuru Road Accident: మైసూరులో ఘోర రోడ్డు ప్రమాదం, ఇన్నోవాను ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్ బస్సు, ఇద్దరు చిన్నారులతో సహా 10 మంది అక్కడికక్కడే మృతి
కర్ణాటకలోని మైసూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు..ఇన్నోవా కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో పది మంది మృత్యువాతపడ్డారు. చనిపోయిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాదంలో మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.
Mysuru, May 29: కర్ణాటకలోని మైసూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు..ఇన్నోవా కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో పది మంది మృత్యువాతపడ్డారు. చనిపోయిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాదంలో మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. మైసూరు జిల్లాలోని కొల్లేగల - టీ నర్సిపుర ప్రధాన రహదారిపై కురుబురు గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు బళ్లారికి చెందిన వారని, వారంతా మలే మాదేశ్వరుని దర్శించుకుని మైసూరు నగరానికి వస్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో మృతదేహాలు ఇరుక్కుపోయి తీవ్రంగా చితికిపోయినట్లు కనిపించాయి.
(The above story first appeared on LatestLY on May 29, 2023 05:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

