Kerala Shocker: ఒకరి తర్వాత ఒకరు..రిసార్ట్లో 17 ఏళ్ళ బాలికపై నలుగురు దారుణంగా అత్యాచారం, బయటకు చెబితే చంపేస్తామని బెదిరింపులు, ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
కేరళలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 17 ఏండ్ల బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి (Minor Girl Gangraped in Kozhikode) పాల్పడ్డారు. ఆపై ఘటన గురించి ఎవరికైనా చంపేస్తామని తీవ్రంగా బెదిరించారు.
Kozhikode, October 21: కేరళలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 17 ఏండ్ల బాలికపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి (Minor Girl Gangraped in Kozhikode) పాల్పడ్డారు. ఆపై ఘటన గురించి ఎవరికైనా చంపేస్తామని తీవ్రంగా బెదిరించారు. ఎట్టకేలకు రెండు వారాల తర్వాత బాలిక విషయం బయటపెట్టడంతో ఈ అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. కేరళలోని కోజికోడ్ జిల్లా కుట్టియాడి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 3న బాధిత బాలికను ఆమె స్నేహితుడు స్థానికంగా ఉండే ఓ టూరిస్ట్ స్పాట్కు ఆహ్వానించాడు. అక్కడికి వెళ్లిన బాలికను రిసార్ట్ లోపలికి తీసుకెళ్లి మత్తుమందు కలిపిన జ్యూస్ తాగించాడు. ఆమె మత్తులోకి జారుకోగానే తన ముగ్గురు స్నేహితులను పిలిచి నలుగురు కలిసి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. చివరికి స్పృహలోకి వచ్చిన బాలికను విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించి ఆమె ఇంటి దగ్గర వదిలి వెళ్లారు. అయితే, రెండు వారాల నుంచి మూభావంగా ఉన్న బాలిక ఎట్టకేలకు ధైర్యం చేసి మంగళవారం సాయంత్రం తల్లిదండ్రులకు జరిగిన ఘోరం గురించి చెప్పింది.
దాంతో వారు స్థానిక పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబం నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఈ ఉదయం నిందితులు నలుగురిని అదుపులోకి (4 Accused Arrested) తీసుకున్నారు. వారిపై సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేశారు.
(The above story first appeared on LatestLY on Oct 21, 2021 03:43 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

