Kerala Shocker: 17 ఏళ్ళ బాలికపై 38 మంది కామాంధులు అత్యాచారం, దారుణ ఘటన కేరళలో వెలుగులోకి, 44 మందిపై 32 కేసులు నమోదు చేసిన పోలీసులు, కొందరు అరెస్ట్, మరికొందరు పరారీలో..
stop rape Rape accused| Representational Image (Photo Credits: File Image)

Malappuram, jan 19: కేరళలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కేరళలోని మలప్పురం ప్రాంతంలోని 17 ఏళ్ల బాలికపై గత కొన్ని నెలలుగా 38 మంది పురుషులు అత్యాచారం చేసి, వేధింపులకు గురిచేశారని (Minor rape survivor in Kerala) ఆ బాలిక ఫిర్యాదు చేసింది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు 44 మంది పురుషులపై మొత్తం 32 కేసులు నమోదు చేశారు. వీరిలో ఎక్కువ మందిని అరెస్టు చేయగా మరికొందరు పరారీలో ఉన్నారు.

కొన్ని నెలలుగా తనపై 38 మంది లైంగిక దాడికి పాల్పడ్డారని (sexually abused) కేరళకు చెందిన ఓ బాలిక (17) తెలిపింది. ఆమెకు నిర్భయ కేంద్రంలో కౌన్సిలింగ్‌ ఇస్తున్న సమయంలో ఈ వివరాలను బయట పెట్టింది. ఆ బాలిక 13-14 ఏళ్ల వయసు ఉన్న సమయంలోనే ఆమెపై పలుసార్లు అత్యాచారంజరిగింది. దీంతో అధికారులు ఆమెను అప్పట్లో చిన్నారుల సంరక్షణ గృహానికి తరలించారు.

గత ఏడాది ఆ బాలిక తల్లి, సోదరుడితో ఆమెను ఇంటికి పంపారు. అయితే, కొన్ని రోజులకు ఆమె అదృశ్యమైంది. ఆ బాలిక ఆచూకీ కోసం గాలించిన పోలీసులు ఆమె పాలక్కడ్‌లో ఉందని గుర్తించి, గత ఏడాది డిసెంబరులో నిర్భయ కేంద్రానికి తరలించారు. దీంతో తనపై 38 మంది లైంగిక దాడి, వేధింపులకు పాల్పడ్డారని ఆ బాలిక తెలిపింది. ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన వారందరినీ పోలీసులు అరెస్టు చేసి ఈ కేసులో విచారణ కొనసాగిస్తున్నారు.కేరళలోని మలప్పురం జిల్లాలోని పాండిక్కడ్ ప్రాంతంలో గత 5 సంవత్సరాల నుంచి ఈ సంఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.

కన్న కూతురిపై ఏడేళ్లుగా కిరాతక తండ్రి అత్యాచారం, హర్యానా రాష్ట్రంలోని హిసార్‌ నగరంలో దారుణ ఘటన, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు

మలప్పురం జిల్లా పోలీసు చీఫ్ ప్రకారం.. 2015 లో బాలిక తన తల్లితో కలిసి మలప్పురం జిల్లాలోని పాండిక్కాడ్ ప్రాంతంలోని ఒక చిన్న కాలనీలో నివసించింది. కొద్ది రోజులకు ఆ బాలిక తప్పిపోవడంతో తల్లి ఆధారంగా స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లుగద కేసు నమోదై ఉంది. బాలిక తన స్నేహితుడితో వెళ్లిందని, ఫిర్యాదుల ఆధారంగా ఆమెను గుర్తించి తిరిగి కుటుంబానికి అప్పగించారని కుటుంబం తెలిపింది. అప్పట్లో దీనిపై రెండు పోక్సో కేసులు నమోదయ్యాయి. 2017 లో బాలిక కుటుంబం యొక్క ఫిర్యాదు ఆధారంగా ఇలాంటి కేసు మళ్లీ నమోదు చేయబడింది. అన్ని కేసులలో, నిందితులను పోక్సో సెక్షన్ల కింద అరెస్టు చేశారు

పదమూడేళ్ల బాలికపై ఒకరి తర్వాత ఒకరు లైంగికదాడి, అయిదు రోజుల్లో రెండు సార్లు అత్యాచారం చేసిన కామాంధులు, పోస్కో మరియు ఐపీసీ సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేసిన మధ్యప్రదేశ్ పోలీసులు

పోలీసులు అత్యాచారం కేసులో మూడు, మిగిలినవి వేధింపుల ఆరోపణలతో సహా మొత్తం 32 కేసులను నమోదు చేశారు. 20 మందిని అరెస్టు చేశారు. మిగిలిన 24 మందిని ఇంకా అదుపులోకి తీసుకోలేదు. బాలిక తన తల్లితో కలిసి ఒక చిన్న ఇంట్లో నివసించిందని, ఒకసారి ఆమె తల్లి తన రోజువారీ కూలీ పని కోసం బయలుదేరితే, ఆమె ఒంటరిగా ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆ సమయంలోనే పొరుగువారు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు,

సామాజిక కార్యకర్త పి గీతా మాట్లాడుతూ.. శిశు సంక్షేమ కమిటీ ఇలాంటి కేసులను పట్టించుకోలేదని తీవ్రంగా విమర్శించారు. "పోక్సో కేసులను చూసుకోవలసిన బాధ్యత సిడబ్ల్యుసికి ఉంది, కాని చాలాసార్లు వారు ఈ కేసులను తీవ్రంగా పరిగణించరు. ఈ సందర్భంలో సిడబ్ల్యుసి బాలిక భద్రతను నిర్ధారించకుండా తిరిగి తన ఇంటికి పంపింది. పొరుగువారు పదేపదే ఆ పని చేసారు అలాంటి సంఘటనలు పదేపదే జరుగుతాయి "అని ఆమె అన్నారు.