Image used for representational purpose only | (Photo Credits: ANI)

Bhopal, Nov 17: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన (Madhya Pradesh Shocker) జరిగింది. కుమార్తె కులాంతర వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని ఓ తండ్రి హేయమైన చర్యకు ఒడిగట్టాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడి, ఆపై కర్కశంగా (Ratibad Man rapes and kills daughter) చంపేశాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ జిల్లాలోని రాటీబాద్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల బాధిత మహిళ 8 నెలల కుమారుడు అనారోగ్యంతో చనిపోవడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు నిందితుడు కూతుర్ని సమీపంలోని సంసాగఢ్ అటవీ ప్రాంతంకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో సంవత్సరం క్రితం ఆమె చేసుకున్న ప్రేమ వివాహంపై అక్కడ తండ్రీ కుమార్తెల మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన 55 ఏళ్ల ఆమె తండ్రి.. కుమార్తె అన్న విచక్షణ కూడా లేకుండా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కాలకృత్యం కోసం నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లిన మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, నెల రోజుల పాటు గ్యాంగ్ రేప్, దారుణం..

అనంతరం ఆమెను గొంతు నులిమి చంపేశాడు. బాధిత మహిళ, అనారోగ్యంతో చనిపోయిన ఆమె 8 నెలల కుమారుడి మృతదేహాలు రెండు రోజుల క్రితం ఆ అటవీ ప్రాంతంలో లభ్యమయ్యాయి. నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడని, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 మరియు 376 కింద పోలీసులు అరెస్టు చేశారు.

ఇండియా టుడేతో రాతిబాద్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సుదేష్ తివారీ మాట్లాడుతూ, రెండు రోజుల క్రితం అడవిలో మహిళ మరియు శిశువు యొక్క ఛిద్రమైన మృతదేహం కనుగొనబడింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించినప్పుడు, మృతదేహం సెహోర్ జిల్లాలోని బిల్కిస్‌గంజ్‌కు చెందిన మహిళగా గుర్తించారు. విచారణలో మృతురాలు ఏడాది క్రితం పారిపోయి పెళ్లి చేసుకోవడంతో (inter-caste love marriage) కుటుంబ సభ్యులు అసంతృప్తిగా ఉన్నట్లు గుర్తించారు. కుటుంబీకులను విచారించగా తండ్రి నేరాన్ని అంగీకరించాడు.

సాటి స్త్రీ పై ఇంత అమానుషమా..మహిళా ఖైదీ దుస్తులు విప్పించి, ఇతరుల ముందు నగ్నంగా డ్యాన్స్ వేయించిన లేడీ ఇన్‌స్పెక్టర్, మండిపడిన పాకిస్తాన్ ఉన్నతాధికారులు, ఉద్యోగం నుంచి తొలగింపు

సుధేష్ తివారీ తెలిపిన వివరాల ప్రకారం, తన ప్రేమ వివాహం విషయంలో కుటుంబాన్ని సమాజం అవహేళన చేసిందని తండ్రి విచారణలో చెప్పాడు. అదే కారణంగా పెళ్లి తర్వాత ఆమె తల్లిదండ్రుల ఇంటికి రాలేదు. అయితే ఈ దీపావళికి ఆమె తన అక్క ఇంటికి వెళ్లింది. దురదృష్టవశాత్తు, ఆమె శిశువు అనారోగ్యంతో అక్కడ మరణించింది.అక్క వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి జరిగిన విషయం తెలిపింది. ఆమె తన కొడుకుతో కలిసి రాతిబాద్ చేరుకున్నాడు, అక్కడ దాదాపు రెండు వారాల క్రితం ఈ సంఘటన జరిగిందని తెలిపారు.