Maharashtra: నీ వల్లనే గర్భం వచ్చిందంటూ రూ.67 లక్షలు వసూలు! ఇద్దరు స్నేహితులతో కలిసి ప్రియుడ్ని బ్లాక్‌మెయిల్ చేసిన యువతి, సామాజిక కార్యకర్తనంటూ యువకుడ్ని హడలెత్తించిన నిందితులు, హడలెత్తిపోయి ఎంత అడిగితే అంత ఇచ్చిన వ్యక్తి

చీటింగ్ చేయడంతో కొత్త కొత్తదారులు వెతుక్కుంటున్నారు మనుషులు. తనతో సంబంధం పెట్టుకున్న వ్యక్తిని ప్రెగ్నెన్సీ పేరుతో ఏకంగా రూ.67 లక్షలు మోసం చేసింది ఓ యువతి. నీ వల్లనే గర్భం (pregnant) వచ్చిందంటూ అతన్ని బెదిరించి పెద్దమొత్తంలో వసూలు ( blackmailed) చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో (Pune) జరిగింది.

Maharashtra: నీ వల్లనే గర్భం వచ్చిందంటూ రూ.67 లక్షలు వసూలు! ఇద్దరు స్నేహితులతో కలిసి ప్రియుడ్ని బ్లాక్‌మెయిల్ చేసిన యువతి, సామాజిక కార్యకర్తనంటూ యువకుడ్ని హడలెత్తించిన నిందితులు, హడలెత్తిపోయి ఎంత అడిగితే అంత ఇచ్చిన వ్యక్తి

Pune, July 31: చీటింగ్ చేయడంతో కొత్త కొత్తదారులు వెతుక్కుంటున్నారు మనుషులు. తనతో సంబంధం పెట్టుకున్న వ్యక్తిని ప్రెగ్నెన్సీ పేరుతో ఏకంగా రూ.67 లక్షలు మోసం చేసింది ఓ యువతి. నీ వల్లనే గర్భం (pregnant) వచ్చిందంటూ అతన్ని బెదిరించి పెద్దమొత్తంలో వసూలు ( blackmailed) చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో (Pune) జరిగింది. తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఈ మేరకు అతడ్ని మోసగించి పారిపోయింది. దీంతో బాధిత వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. వ్యాపారి అయిన బంధువు వద్ద 26 ఏళ్ల వ్యక్తి పని చేస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో కోరెగావ్ భీమా (Koregaon Bhima) ప్రాంతంలోని ఒక లాడ్జిలో బస చేసిన సమయంలో ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. అనంతరం ఆమెతో సంబంధానికి దారి తీసింది. దీంతో ఆ మహిళకు అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చేవాడు. కాగా, ఆ మహిళ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆ వ్యక్తిని బ్లాక్‌మెయిల్‌ (blackmailed) చేసింది.

Bihar University: ఇదెక్కడి విచిత్రంరా బాబు! 100కు 151 మార్కులు వేసిన బీహార్ యూనివర్సిటీ, మార్కుల మెమో చూసి బిత్తరపోయిన స్టూడెంట్, పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ కు 151 మార్కులు, అకౌంట్స్ విద్యార్ధికి సున్నా మార్కులు, బీహార్ యూనివర్సిటీ లీలలు 

హడప్సర్‌లో నివాసం ఉండే 26 ఏళ్ల చేతన్ రవీంద్ర హింగ్‌మీర్‌ను భర్తగా, 27 ఏళ్ల నిఖిల్ అలియాస్ గౌరవ్ మ్హెత్రేని సామాజిక కార్యకర్తగా పరిచయం చేసింది. తాను ప్రెగ్నెంట్‌ అని, రేప్‌ కేసు పెడతానంటూ ఆ వ్యక్తిని బెదిరించింది. దీంతో ఆ ముగ్గురు కలిసి అతడి నుంచి పలు దఫాలుగా రూ.67.07 లక్షలు వసూలు చేశారు.

Patra Chawl Land Scam Case: శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ అరెస్ట్, పత్రాచల్ భూ కుంభకోణంలో అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు 

అయితే మరింతగా డబ్బులు డిమాండ్‌ చేస్తుండటంతో ఆ వ్యక్తి కోంద్వా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఇన్‌స్పెక్టర్ హేమంత్ పాటిల్ నేతృత్వంలో క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన యాంటీ ఎక్స్‌టార్షన్ సెల్ బృందం రంగంలోకి దిగింది. ఈ కేసు దర్యాప్తును ప్రారంభించింది. మహిళ స్నేహితులైన రవీంద్ర, నిఖిల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న ఆ మహిళ కోసం గాలిస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Jul 31, 2022 10:26 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).