'Mukesh Ambani Moving to London': లండన్‌కు షిఫ్ట్ అవుతున్న ముకేష్ అంబానీ, 300 ఎక‌రాల విస్తీర్ణంలో 49 బెడ్‌రూమ్‌ల‌తో కొత్త ఇంటిని నిర్మించుకున్న రిలయన్స్ అధినేత, సోషల్ మీడియాలో గుప్పుమంటున్న వార్తలు

అసియా లోనే నెంబ‌ర్ వ‌న్ ధ‌న‌వంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ త్వరలో లండన్ కి మకాం (Mukesh Ambani Reportedly Moving To UK) మార్చనున్నట్లు ఓ ప్రముఖ పత్రిక మిడ్-డే కథనాన్ని వెలువరించింది.

'Mukesh Ambani Moving to London': లండన్‌కు షిఫ్ట్ అవుతున్న ముకేష్ అంబానీ, 300 ఎక‌రాల విస్తీర్ణంలో 49 బెడ్‌రూమ్‌ల‌తో కొత్త ఇంటిని నిర్మించుకున్న రిలయన్స్ అధినేత, సోషల్ మీడియాలో గుప్పుమంటున్న వార్తలు
Mukesh Ambani (Photo Credits: File Image)

అసియా లోనే నెంబ‌ర్ వ‌న్ ధ‌న‌వంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ త్వరలో లండన్ కి మకాం (Mukesh Ambani Reportedly Moving To UK) మార్చనున్నట్లు  ప్రముఖ పత్రిక మిడ్-డే కథనాన్ని వెలువరించింది. ఈ మేరకు ఆయన లండ‌న్‌లో ఇటీవ‌ల నిర్మించిన కొత్త ఇంట్లోనే (Mukesh Ambani London House) దీపావళి వేడుకలు ముకేశ్ అంబానీ కుటుంబం జ‌రుపుకుందని వార్తాక‌థ‌నం రాసింది. అయితే అంబానీ కుటుంబం (Mukesh Ambani family) ఇంకా ఈ నివేదికలను ధృవీకరించలేదు . దీనిపై ఇంకా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

బ‌కింగ్‌హమ్ షైర్‌లో 300 ఎక‌రాల విస్తీర్ణంలో 49 బెడ్‌రూమ్‌ల‌తో కొత్త ఇల్లు స్టోక్ పార్క్ ఆయ‌న నిర్మించుకున్నార‌ని ఈ వార్తా కథనంలో తెలిపింది. కాగా లండన్ లోని కొత్త స్టోక్ పార్క్ లో అత్యాధునిక వైద్య సదుపాయంతో  పాటు ఇతర విలాసవంతమైన సదుపాయాలు ఉన్నాయి. ఈ 300 ఎక‌రాల భూమిని రూ.592 కోట్ల‌కు కొనుగోలు చేశార‌ని  తెలుస్తోంది. ముంబైతోపాటు లండ‌న్‌లోనూ ముకేశ్ అంబానీ కుటుంబం జీవించ‌నుందని, క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో సెకండ్ హోం అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న కుటుంబం భావించిన‌ట్లు తెలుస్తోంది.

కాగా ముంబైలోని ఆల్టామౌంట్ రోడ్డులో నాలుగు ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో గ‌ల విలాస‌వంత‌మైన ఇంటికి ముకేశ్ అంబానీ.. అంటిల్లా అని నామ‌క‌ర‌ణం చేశారు. క‌రోనా లాక్‌డౌన్ వేళ ఆయ‌న కుటుంబం గుజ‌రాత్‌లోని జామ్‌న‌గ‌ర్‌లోనే గ‌డిపింది. ఇదే జామ్‌న‌గ‌ర్‌లో ప్ర‌పంచంలోకెల్లా అతిపెద్ద పెట్రోకెమిక‌ల్ రిఫైన‌రీ ఫ్యాక్ట‌రీని రిల‌య‌న్స్ న‌డుపుతోంది.

ముంబైలో ఆగని డ్రగ్స్‌ దందా, తాజాగా రూ.4 కోట్ల విలువైన 700 గ్రాముల హెరాయిన్‌ పట్టివేత, నిందితుడిని అరెస్ట్ చేసిన ముంబై ఎన్సీబీ పోలీసులు

వచ్చే ఏడాది ఏప్రిల్‌లో వారి UKకు వెళ్తారని తెలుస్తోంది. అక్కడ విలాస భవంతిలో ఒక మందిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ మందిరం కోసం ముంబై నుండి ఇద్దరు పూజారులను తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. ఈ మందిరం డిజైన్ వారి ముంబైలోని వారి ఇల్లు, వివిధ భారతీయ కార్యాలయాలలో ఉన్న వాటిని పోలి ఉంటుంది. గణేశుడు, రాధా-కృష్ణుడు, హనుమంతుని పాలరాతి శిల్పాలు రాజస్థాన్ శిల్పి నుండి చెక్కించబడ్డాయి. అంబానీకి చెందిన కొత్త ఆస్తిలో బ్రిటీష్ డాక్టర్ నేతృత్వంలోని మినీ-హాస్పిటల్ కూడా ఉంది.

Stoke Park property

 

View this post on Instagram

 

A post shared by Stoke Park (@stokepark)

అయితే స్టోక్ పార్క్ ఆస్తి ఎందుకు?

నివేదిక ప్రకారం, కుటుంబం స్థలం పరంగా మరింత ఓపెన్‌గా ఉండాలని అంబానీ కుటుంబం కోరుకుంటోంది. ముంబైలోని అత్యంత అందమైన ప్రదేశంలో ఉన్న వారి నిలువు భవనం 'యాంటిలియా' లో అలాంటిది ఏమీ లేదు. కాబట్టి అంబానీలు గత సంవత్సరం కొత్త ఇంటి కోసం వేట ప్రారంభించారు. చివరకు స్టోక్ పార్క్ కొనుగోలు చేశారు. ఆ 300 ఎకరాల ఆస్తిని పరిష్కరించే పని ఆగస్టులో ప్రారంభమైంది. ఇప్పుడు పూర్తిగా కొలిక్కి వచ్చింది. 1908 తరువాత, ఒక ప్రైవేట్ నివాసంగా ఉన్న ఈ భవనం కంట్రీ క్లబ్‌గా మార్చబడింది. మీడియా నివేదికల ప్రకారం, ఈ భవనం జేమ్స్ బాండ్ చిత్రంలో కూడా కనిపించింది.

(The above story first appeared on LatestLY on Nov 05, 2021 07:31 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).