
Mumbai, July 19: ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ స్థలం వివాదం విషయంలో వాదోపవాదనలు వినిపిస్తున్న న్యాయవాదిపై (Lawyer Satyadev Joshi Attacked) నడిరోడ్డు మీదే కొందరు దుండగులు పదునైన ఆయుధాలతో మూకుమ్మడి దాడి చేశారు. కత్తులు, రాడ్లతో విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు.
పట్టపగలు నడిరోడ్డుపై 15- 20 మందికి పైగా దాడి చేయడంతో ఆ న్యాయవాది (Mumbai Lawyer Satyadev Joshi) తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆ న్యాయవాది (Mumbai Lawyer) ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో కలకలం రేపింది. ఈ దాడికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
Advocate Madan J Gupta ట్వీట్ చేసిన వీడియో ప్రకారం...ముంబైకి చెందిన న్యాయవాది సత్యదేవ్ జోషి ఓ స్థలం వివాదంపై కేసు స్వీకరించారు. ప్రస్తుతం న్యాయస్థానంలో ఆ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆ స్థలాన్ని పరిశీలించేందుకు ఆదివారం మధ్యాహ్నం కారులో తన సహాయకుడు అంకిత్ టాండన్తో కలిసి బయల్దేరారు. ఈ విషయం తెలుసుకున్న ప్రత్యర్థులు న్యాయవాది కారును వెంబడించి పశ్చిమ ముంబైలోని దహిసర్ ప్రాంతంలో అడ్డగించారు.
కారు దిగిన తరువాత అతనిపై కత్తులు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. అందరూ చూస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో అక్కడ భయానక వాతావరణం ఏర్పడింది. ఏకంగా 14 మంది ఉండడంతో ప్రజలు భయాందోళన చెందారు. ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై కూడా ఆ ముఠా దాడికి పాల్పడింది. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఎంహెచ్బీ కాలనీ పోలీసులు విచారణ చేపట్టారు.
Here's Watch the video of the attack
Adv. Satyadev Joshi came to be assaulted today with swords & such deadly weapons by local goons at Kandivali while rendering professional services to a client. He is hospitalised.
This shows the law and order condition of Mum. @AUThackeray @OfficeofUT @Dwalsepatil @Dev_Fadnavis pic.twitter.com/3ZTuT1JyVz
— Adv Madan J. Gupta (@AdvmadanG) July 18, 2021
నిందితులు బొరివలీకి చెందిన వారుగా గుర్తించారు. దాడికి పాల్పడిన వారిలో ముగ్గురిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా వారిని కూడా అదుపులోకి తీసుకు���ేందుకు పోలీసులు గాలిస్తున్నారు. అయితే న్యాయవాదిపై దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చాయి.