UP Shocker: శోభనం గదిలోనే కొత్త దంపతులిద్దరికీ హార్ట్ ఎటాక్‌, మంచం మీదనే కన్నుమూసిన పెళ్లికూతురు, పెళ్లికొడుకు, ఇద్దరినీ ఒకే చితిమీద దహనం చేసిన కుటుంబ సభ్యులు

నవ దంపతులు పెళ్లైన మరునాడే గుండెపోటుతో మరణించారు (Newly married couple dies of heart attack). దీంతో ఆ కొత్త జంట మృతదేహాలను ఒకే చితిపై ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 22 ఏళ్ల ప్రతాప్ యాదవ్, 20 ఏళ్ల పుష్పకు మే 30న మంగళవారం రాత్రి పెళ్లి జరిగింది.

UP Shocker: శోభనం గదిలోనే కొత్త దంపతులిద్దరికీ హార్ట్ ఎటాక్‌, మంచం మీదనే కన్నుమూసిన పెళ్లికూతురు, పెళ్లికొడుకు, ఇద్దరినీ ఒకే చితిమీద దహనం చేసిన కుటుంబ సభ్యులు
Credits: Google

Lucknow, June 04: నవ దంపతులు పెళ్లైన మరునాడే గుండెపోటుతో మరణించారు (Newly married couple dies of heart attack). దీంతో ఆ కొత్త జంట మృతదేహాలను ఒకే చితిపై ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 22 ఏళ్ల ప్రతాప్ యాదవ్, 20 ఏళ్ల పుష్పకు మే 30న మంగళవారం రాత్రి పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత కొత్త జంట బుధవారం సాయంత్రం వరుడి ఇంటికి చేరుకున్నారు. నవ దంపతులు ఆ రాత్రికి ఒకే గదిలో కలిసి నిద్రించారు. అయితే గురువారం మధ్యాహ్నం వరకు వారిద్దరూ గది నుంచి బయటకు రాలేదు. అనుమానించిన వరుడి కుటుంబ సభ్యులు తలుపులు బద్ధలుకొట్టి లోనికి వెళ్లి చూశారు. పెళ్లైన కొత్త జంట చనిపోయి ఉండటం చూసి షాక్‌ అయ్యారు.

Black Market in Manipur: మణిపూర్‌లో లీటర్ పెట్రోల్ రూ.200, అన్ని నిత్యావసరాల ధరలు డబుల్ చేసిన వ్యాపారులు, పెట్రోల్ బంకుల ముందు బారెడు లైన్లు 

కాగా, కుటుంబ సభ్యులు దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. నవ దంపతుల మృతదేహాలను పరిశీలించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వారిద్దరూ గుండెపోటు వల్ల మరణించినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలిందని పోలీస్‌ అధికారి తెలిపారు. వారు నిద్రించిన గదిని ఫోరెన్సిక్‌ నిఫుణులతో పరిశీలించినట్లు చెప్పారు. ఆ జంట శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, ఆ గదిలోకి ఎవరూ కూడా బలవంతంగా వెళ్లిన ఆనవాళ్లు లేవన్నారు.

Govt Bans 14 Fixed Dose Combination Drugs: ఈ కాంబినేషన్ మందులు వాడొద్దని హెచ్చరిస్తూ 14 ఔషధాలను బ్యాన్‌ చేసిన కేంద్రప్రభుత్వం.. నిషేధిత ఔషధాలలో సాధారణ ఇన్ఫెక్షన్లు, దగ్గు, జ్వరం చికిత్సకు ఉపయోగించే మందులు.. కారణం ఏంటంటే?? 

ఈ నేపథ్యంలో కొత్తగా పెళ్లైన యువ దంపతులు శోభనం తర్వాత రోజు ఒకేసారి గుండెపోటుతో చనిపోవడం మిస్టరీగా ఉందన్నారు. దీనికి కారణం ఏమిటన్నది అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. మరోవైపు పెళ్లైన మరునాడే గుండెపోటుతో చనిపోయిన నవ దంపతులైన ప్రతాప్‌, పుష్ఫకు ఒకే చితిపై అంత్యక్రియలు నిర్వహించారు. ఇది చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు.

(The above story first appeared on LatestLY on Jun 04, 2023 10:31 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).