
New Delhi, February 29: మరో మూడు రోజుల్లో నిర్భయ దోషులను (Nirbhaya Case Convicts) ఉరితీయాల్సి ఉంది. ఉరిశిక్ష అమలుకు తీహార్ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో.. ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఉరిశిక్షను వాయిదా వేసేందుకు దోషులు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు.
తాజా నలుగురు దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్తా (Pawan Singh Gupta) సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ వేశాడు. తన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని కోర్టును (Supreme Court) అభ్యర్థించాడు.
ఉరితీతపై కింది కోర్టులకు స్వేచ్ఛ కల్పించిన సుప్రీంకోర్ట్
ఉరిశిక్ష విధిస్తూ ట్రయల్ కోర్టు జారీచేసిన ఆదేశాలను వాయిదావేయాలని కోరుతూ క్యురేటివ్ పిటిషన్ దాఖలుచేశాడు. ఈ నెల 17న ట్రయల్ కోర్టు నిర్భయ కేసు దోషులను మార్చి 3న ఉదయం 6 గంటలకు ఉరి తీయాలని డెత్ వారెంట్లను జారీచేసింది. ఈ ఆదేశాల్ని సవాల్చేస్తూ.. పవన్కుమార్ గుప్తాకు ఉరిశిక్ష వేయొద్దని అతని తరఫు న్యాయవాది ఏపీ సింగ్ క్యురేటివ్ పిటిషన్ ద్వారా విజ్ఞప్తిచేశారు.
తాను మైనర్ అంటూ నిర్భయ కేసులో దోషి పవన్ గుప్తా పెట్టుకున్న పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్ట్
ఇప్పటివరకు ఎలాంటి న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోని పవన్ వేసిన క్యురేటివ్ పిటిషన్ తిరస్కరణకు గురైతే రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరే వెసులుబాటు అతనికి ఉన్నది. మిగిలిన ముగ్గురు దోషులు.. రాష్ట్రపతికి పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థన తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే.
నిర్భయ గ్యాంగ్రేప్, హత్య కేసులో దోషుల్లో ఒకరైన పవన్ సింగ్ గుప్తా పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. ఈ పిటిషన్ను జస్టిస్ ఎన్ వి రమణ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారించనుంది. నలుగురు దోషుల్లో ఇప్పటికే ముగ్గురు దోషులు తమకున్న న్యాయపరమైన అవకాశాలన్నింటినీ ఉయోగించుకున్నారు. పవన్ గుప్తా మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అవకాశాలను వినియోగించుకోలేదు. తాజాగా అతను కూడా న్యాయపరమైన అవకాశాన్ని వినియోగించుకునేందుకు రెడీ అయ్యాడు.
పవన్ గుప్తాకు ఇంకా రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకునే అవకాశం కూడా మిగిలేవుంది. ఇప్పటికే ఈ కేసులో (2012 Delhi gangrape-murder case) ముకేష్ కుమార్ సింగ్, వినయ్ కుమార్ శర్మ, అక్షయ్ కుమార్ క్యురేటివ్ పిటిషన్లతో పాటు.. రాష్ట్రపతి క్షమాభిక్ష అవకాశాలను వినియోగించకున్నారు. అయితే, వీరి పిటిషన్లన్నీ తిరస్కరణకు గురయ్యాయి. దీనిని సవాలు చేస్తూ ముకేష్, వినయ్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. వారి పిటిషన్లను సుప్రీం కోర్టు తిరస్కరించింది.
ఇదిలా ఉంటే పవన్ గుప్తా క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఉరిశిక్ష మరోసారి వాయిదా పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకా క్షమాభిక్ష ఉపయోగించుకునే అవకాశం కూడా ఉండటంతో ఉరిశిక్ష అమలుకు ఇంకెంతకాలం పడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
దోషిగా ఉన్న పవన్ యొక్క అభ్యర్ధనను ఉన్నత న్యాయస్థానం పరిష్కరించే విధానం, భయంకరమైన నేరానికి పాల్పడినవారిని షెడ్యూల్ చేసిన తేదీన ఉరితీస్తుందో లేదో నిర్ణయిస్తుంది. అంతకుముందు, దోషులకు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాది, ఎపి సింగ్, వారిని "ఎప్పుడూ ఉరి తీయలేరని" ప్రాసిక్యూషన్కు చెప్పినట్లు తెలిసింది. తరువాత విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు, న్యాయవాది చట్టంలోని నిబంధనలను పట్టించుకోకుండా ఉరిశిక్షను వేగవంతం చేయలేమని చెప్పారు.
ఈ నలుగురు 2012 డిసెంబర్ 16 రాత్రి కదిలే బస్సులో 23 ఏళ్ల వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో దోషులుగా తేలింది. మరో ప్రధాన దోషి రామ్ సింగ్ తిహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేరానికి పాల్పడిన ఒక మైనర్, బాల్య న్యాయ గృహంలో మూడేళ్ళు గడిపిన తరువాత విడుదల చేయబడ్డాడు.