No Fly List: గత మూడేళ్ల నుండి నో ఫ్లై లిస్ట్ లో 166 మంది విమాన ప్రయాణికులు, వచ్చే ఏడేళ్లలో దేశంలో సుమారు 1,600 విమానాలు అందుబాటులోకి వస్తాయని తెలిపిన కేంద్ర మంత్రి
ఏవియేషన్ వాచ్డాగ్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) 2021 నుండి 'నో ఫ్లై లిస్ట్'ని ఏర్పాటు చేసింది.దీని ప్రకారం 166 మంది ప్రయాణికులు నిర్ణీత వ్యవధిలో భారతదేశం నుండి విమానాలు ఎక్కకుండా నిషేధించారు. ఈ విషయాన్ని సోమవారం పార్లమెంటుకు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ (రిటైర్డ్) తెలిపారు
ఏవియేషన్ వాచ్డాగ్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) 2021 నుండి 'నో ఫ్లై లిస్ట్'ని ఏర్పాటు చేసింది.దీని ప్రకారం 166 మంది ప్రయాణికులు నిర్ణీత వ్యవధిలో భారతదేశం నుండి విమానాలు ఎక్కకుండా నిషేధించారు.
ఈ విషయాన్ని సోమవారం పార్లమెంటుకు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ (రిటైర్డ్) తెలిపారు.2020లో 4,786, 2021లో 5,321, 2022లో 5,525, ఈ ఏడాది జనవరి నుంచి 2,384 ఫిర్యాదులు నమోదయ్యాయని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ (రిటైర్డ్) రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలిపారు.
అటవి మంటల్ని ఆర్పుతుండగా ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న రెండు హెలికాప్టర్లు, ముగ్గురు మృతి
2014లో దేశంలోని షెడ్యూల్డ్ ఆపరేటర్ల ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ (AOC)లో ఆమోదించబడిన విమానాల ఫ్లీట్ పరిమాణం 395 అయితే 2023 నాటికి 729గా ఉందన్నారు.DGCAకి అందిన సమాచారం ప్రకారం, దేశంలోని ప్రధాన దేశీయ విమానయాన సంస్థల్లో మొత్తం విమానాల సంఖ్య వచ్చే ఏడేళ్లలో సుమారుగా 1,600కు చేరుకుంటాయని మంత్రి తెలిపారు.
(The above story first appeared on LatestLY on Aug 07, 2023 08:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

