India-China Disengagement: సరిహద్దులో ఇండోచైనా దళాలు ఉపసంహరణ, సరికొత్త వీడియోని విడుదల చేసిన ఇండియన్ ఆర్మీ, జూన్ 15న గల్వాన్ లోయలో ఘర్షణ తర్వాత ఇండోచైనా బోర్డర్లో తీవ్ర ఉద్రిక్తత
చైనా-ఇండియా కార్ప్స్ కమాండర్-స్థాయి సమావేశం 9 వ రౌండ్ చైనా వైపు మోల్డో-చుషుల్ సరిహద్దు సమావేశ స్థానం వద్ద జనవరి 24 న జరిగింది. ఈ సమావేశం "సానుకూల, ఆచరణాత్మక మరియు నిర్మాణాత్మకమైనది" అని ఇరు పక్షాలు అంగీకరించాయి, ఇది పరస్పర విశ్వాసం మరియు అవగాహనను మరింత పెంచుతుందని రెండు దేశాలు తెలిపాయి. సైన్యం ఉపసంహరణకు రెండు దేశాలు అంగీకరించాయి.
New Delhi, Feb 16: చైనా-ఇండియా కార్ప్స్ కమాండర్-స్థాయి సమావేశం 9 వ రౌండ్ చైనా వైపు మోల్డో-చుషుల్ సరిహద్దు సమావేశ స్థానం వద్ద జనవరి 24 న జరిగింది. ఈ సమావేశం "సానుకూల, ఆచరణాత్మక మరియు నిర్మాణాత్మకమైనది" అని ఇరు పక్షాలు అంగీకరించాయి, ఇది పరస్పర విశ్వాసం మరియు అవగాహనను మరింత పెంచుతుందని రెండు దేశాలు తెలిపాయి. సైన్యం ఉపసంహరణకు రెండు దేశాలు అంగీకరించాయి.
చైనా మరియు భారతదేశం యొక్క ఫ్రంట్లైన్ దళాలు తూర్పు లడఖ్లోని పంగోంగ్ సరస్సు యొక్క దక్షిణ మరియు ఉత్తర ఒడ్డును వదిలి వెళ్లిపోతున్నాయి. దాదాపు పది నెలలుగా దళాలు ఒకదానికొకటి ఎదురుగా మోహరించబడిన సంగతి విదితమే. అయితే చర్చలు తరువాత దళాలు మొదట్లో గత బుధవారం ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లడం ప్రారంభించాయని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ బీజింగ్లో తెలిపింది.
సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత, 20 మంది భారత జవాన్లు, 40 మంది చైనా సైనికులు మరణం
"పాంగోంగ్ త్సో సరస్సు యొక్క దక్షిణ మరియు ఉత్తర ఒడ్డున ఉన్న చైనా మరియు భారతీయ ఫ్రంట్లైన్ దళాలు ఫిబ్రవరి 10 నుండి బయటకు వచ్చాయని సీనియర్ కల్నల్ వు కియాన్ క్లుప్త ప్రకటనలో తెలిపారు. ఇదిలా ఉంటే గత 10 నెలల నుంచి సరిహద్దు ప్రాంతాల్లో మోహరించి ఉన్న దళాలు తిరిగి వెనక్కి వెళ్తున్న దృశ్యాలను భారత ఆర్మీకి చెందిన నార్తర్న్ కమాండ్ రిలీజ్ చేసింది.
మరికొన్ని ప్రాంతాల్లో చైనా సైనికులు తరలిచేందుకు వీలుగా రవాణావాహనాలు చైనా సిద్ధం చేసిన దృశ్యాలు కూడా వీటిల్లో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఏర్పరిచిన తాత్కాలిక కట్టడాలను కూడా చైనా సైనికులు తొలగిస్తున్న దృశ్యాలన్ని ఆర్మీ షేర్ చేసింది. కాగా..సైన్యాల ఉపసంహరణ మొత్తం ఈ వారం చివర్లో పూర్తయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
Visuals of disengagement at Pangong lake
Fresh #visuals of disengagement at Pangong lake has just been released by Indian Army. pic.twitter.com/05FBNhzNIO
— Defence Decode® (@DefenceDecode) February 16, 2021
Watch: Infantry disengagement at north and south bank of Pangong lake https://t.co/7h5yjGyG6E pic.twitter.com/Tk0NG3lrC8
— Sidhant Sibal (@sidhant) February 16, 2021
గత ఏడాది జూన్ 15న గల్వాన్ లోయలో ఘర్షణ జరిగిన తర్వాత.. ఇండోచైనా బోర్డర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. దానిలో భాగంగా రెండు దేశాలు ఆ ప్రాంతంలో తమ దళాలను మోహరించాయి. అయితే పలు దఫాలుగా రెండు దేశాల మధ్య సైనిక, దౌత్యపరమైన చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా రెండు దేశాల సైనికులు వివాదాస్పద ప్రాంతం నుంచి వెనుదిరుగుతున్నారు. ఈస్ట్రన్ లడాఖ్లోని పాన్గాంగ్ సరస్సు వద్ద నుంచి చైనా దళాలు, ట్యాంకర్లు ఉపసంహరించాయి. దానికి సంబంధించిన ఫోటోలను ఇవాళ ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది.
(The above story first appeared on LatestLY on Feb 16, 2021 05:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

