Mukesh Ambani Get Threat Calls: ముఖేష్ అంబానీని చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్, అలర్ట్ అయిన ముంబై పోలీసులు, దర్యాప్తు వేగవంతం చేసిన అధికారులు
పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సహా ఆయన కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ (Mukesh Ambani Get Threat Calls) వచ్చాయి. రిలయన్స్ ఫౌండేషన్కు చెందిన హరికిషన్దాస్ ఆస్పత్రి నెంబర్కు ఈ బెదిరింపు కాల్స్ వచ్చాయి.
Mumbai, August 15: పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సహా ఆయన కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ (Mukesh Ambani Get Threat Calls) వచ్చాయి. రిలయన్స్ ఫౌండేషన్కు చెందిన హరికిషన్దాస్ ఆస్పత్రి నెంబర్కు ఈ బెదిరింపు కాల్స్ వచ్చాయి.రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ (Reliance Industries chairman), ఆయన కుటుంబ సభ్యులకు బెదిరింపు కాల్స్ వచ్చాయని రిలయన్స్ ఫౌండేషన్ ఫిర్యాదు చేసిందని ముంబై పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. ముఖేష్ అంబానీ లక్ష్యంగా మూడుకు పైగా బెదిరింపు కాల్స్ (Mukesh Ambani Family Get Fresh Threat Calls) వచ్చాయని సమాచారం. ఈ వ్యవహారంపై డీబీ మార్గ్ పోలీసులు మరిన్ని వివరాలను రాబడుతూ దర్యాప్తును వేగవంతం చేశారు.
కాగా గత ఏడాది ముంబైలో ముఖేష్ అంబానీ నివాసం వెలుపల పేలుడు పదార్ధాలతో కూడిన స్కార్పియో కారు, బెదిరింపు లేఖను పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ కేసును ముంబై క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ చీఫ్ సజిన్ వజే సారధ్యంలో దర్యాప్తు చేపట్టగా ఆపై స్కార్పియో యజమాని, ధానేకు చెందిన వ్యాపార వేత్త మన్సుక్ హిరేన్ అనుమానాస్పద మృతి అనంతరం కేసును ఎన్ఐఏకు బదలాయించారు
(The above story first appeared on LatestLY on Aug 15, 2022 02:11 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

