Tamil Nadu: రూంలోకి వెళ్లి.. ఇద్దరు మహిళా డాక్టర్లపై మరో ఇద్దరు వైద్యులు అత్యాచారం, అంతటితో ఆగకుండా వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ పదే పదే అత్యాచారం, తమిళనాడులో దారుణ ఘటన

క్వారంటైన్ లో డ్యూటీలో ఉన్న తోటి మహిళా వైద్యులపై మరో ఇద్దరు డాక్టర్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది. అంతటితో ఆగకుండా (molestation of 2 women docs)ఘటనను వీడియో తీసి.. బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టారు. చివరకు కటకటాలపాలయ్యారు.

Tamil Nadu: రూంలోకి వెళ్లి.. ఇద్దరు మహిళా డాక్టర్లపై మరో ఇద్దరు వైద్యులు అత్యాచారం, అంతటితో ఆగకుండా వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ పదే పదే అత్యాచారం, తమిళనాడులో దారుణ ఘటన
stop rape Rape accused| Representational Image (Photo Credits: File Image)

క్వారంటైన్ లో డ్యూటీలో ఉన్న తోటి మహిళా వైద్యులపై మరో ఇద్దరు డాక్టర్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది. అంతటితో ఆగకుండా (molestation of 2 women docs)ఘటనను వీడియో తీసి.. బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టారు. చివరకు కటకటాలపాలయ్యారు. తమిళనాడులోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (RGGGH)కి చెందిన ఇద్దరు మగ వైద్యులను పోలీసులు నవంబర్ 18, గురువారం అరెస్టు (Chennai GH doctors arrested for rape) చేశారు.

చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఇద్దరు మహిళా డాక్టర్లు చెన్నై టీ నగర్ లోని ఓ స్టార్ హోటల్ లో ఉంటున్నారు. అదే హోటల్ లో ఉన్న వెట్రిసెల్వన్ (35), మోహన్ రాజ్ (25) అనే మరో ఇద్దరు డాక్టర్లు.. మహిళా వైద్యుల గదికి వెళ్లారు. వారిపై అత్యాచారానికి ఒడిగట్టారు. దానిని వీడియో తీసి మళ్లీ మళ్లీ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఎంతకీ వారి అకృత్యాలు ఆగకపోతుండడంతో.. ఆరోగ్య శాఖ మంత్రి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. వారి ఆదేశాల మేరకు చెన్నై పోలీస్ కమిషనర్ విచారణ ప్రారంభించారు. తేనాంపేట మహిళా పోలీసుల విచారణలో నేరం నిర్ధారణ అయింది. దీంతో ఇద్దరు నిందితులను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వారిద్దరినీ ఆరోగ్య శాఖ డిస్మిస్ చేసింది.

శ్రీధర్ రావు రెండు గంటల పాటు నన్ను దారుణంగా రేప్ చేశాడు, సంధ్య కన్‌స్ట్రక్షన్స్‌ ఎండీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన జిమ్ ట్రైనర్, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సనత్‌నగర్‌ పోలీసులు

గురువారం చెన్నై పోలీసులు విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం, ఇద్దరు మహిళా వైద్యులు ఈ ఏడాది ఆగస్టులో COVID-19 డ్యూటీలో ఉన్నారు. చెన్నైలోని టి నగర్‌లోని ఒక ప్రైవేట్ హోటల్‌లో ఉన్నారు. మొదటి ఘటనలో ఆర్‌జిజిజిహెచ్‌లో పనిచేస్తున్న డాక్టర్ ఎస్ వెట్రిసెల్వన్ (35) మహిళా డాక్టర్ ఉంటున్న హోటల్ గదిలోకి చొరబడి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండవ సంఘటనలో, అదే ఆసుపత్రికి చెందిన డాక్టర్ ఎన్ మోహన్‌రాజ్ (28) హోటల్‌లో క్వారంటైన్‌లో ఉన్న మరో మహిళా వైద్యుడిని వేధించాడు.

చెన్నై పోలీసు కమిషనర్‌కు మహిళలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇద్దరు వైద్యులను అరెస్టు చేశారు. పూలబజార్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇద్దరు నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. డాక్టర్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ ఈక్వాలిటీ (DASE) సభ్యురాలు శాంతి రవీంద్రనాథ్ మాట్లాడుతూ, ఇలాంటి క్రూరమైన నేరాలను ఏమాత్రం సహించేది లేదని, ఆరోగ్య సంరక్షణ రంగంలో లైంగిక వేధింపుల కేసులు పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. "చాలా కాలంగా మహిళల భద్రత కోసం DASE కోరుతోంది, ఎందుకంటే ఆరోగ్య సంరక్షణ కార్మికులలో ఎక్కువ మంది ప్రస్తుతం మహిళలు. మహమ్మారి సమయంలో మహిళల పని పరిస్థితి వైద్య రంగంలో మహిళలకు ఇప్పటికే ఉన్న రక్షణ పరిస్థితిని మరింత దిగజార్చింది, ”శాంతి చెప్పారు.

మంచి నిద్రలో ప్రియుడు, కత్తితో మర్మాంగాన్ని కోసేసిన ప్రియురాలు, సృహలోకి వచ్చాక సారి అంటూ ఓదార్పు, హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు

తమిళనాడు మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (TNMSA)తో కలిసి DASE మెడికల్ కాలేజీలు ఆసుపత్రులలో లైంగిక వేధింపుల సమస్యను రాష్ట్రంలోని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు శాంతి చెప్పారు. నిందితులను బదిలీ చేయడం వల్ల పరిష్కారం లభించదు. అలాంటి నేరం చేసిన వ్యక్తిని చట్ట ప్రకారం శిక్షించాలి. ‘ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల సంక్షేమ కమిటీ’, ‘రాష్ట్ర స్థాయి వేధింపుల నిరోధక కమిటీ’ వంటి కమిటీలను ఏర్పాటు చేయాలని శాంతి తెలిపారు.

నవంబర్ 17న, కరూర్‌లోని 55 ఏళ్ల వైద్యుడు ఆసుపత్రిలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది కుమార్తె అయిన మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించినందుకు డాక్టర్‌పై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశారు. చెన్నై నగరంలో ఇటీవల నివేదించబడిన మరో అత్యాచార ఘటన నవంబర్ 4న మైనర్ బాలికపై 23 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితుడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మైనర్‌తో సంభాషణ ప్రారంభించినట్లు సమాచారం.

ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా నిందితుడితో మైనర్ నంబర్‌లు మార్పిడి చేసుకున్నట్లు పోలీసులు విచారణలో తెలిపారు. తిరువారూరుకు చెందిన నిందితుడు ఎస్ గోపీనాథ్ మైనర్‌ని చెన్నైకి పిలిపించి లాడ్జిలో అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. మైనర్ జరిగిన విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియజేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

(The above story first appeared on LatestLY on Nov 20, 2021 04:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).