Tamil Nadu: కోర్టు కాంప్లెక్స్లోనే జడ్డిపై కత్తితో దాడి, తృటిలో తప్పించుకున్న న్యాయమూర్తి, చేతికి తీవ్రగాయాలు, తమిళనాడు సేలం జిల్లాలో ఘటన
తమిళనాడులోని సేలం జిల్లాలో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ను (Judicial Magistrate) కోర్టు కాంప్లెక్స్లో అతని ఆఫీస్ అసిస్టెంట్ కత్తితో పొడిచినట్లు ది హిందూ నివేదించింది. కోర్టు విధుల నుంచి బదిలీ చేశారనే ఆగ్రహంతో ఆఫీస్ అసిస్టెంట్ న్యాయమూర్తిపై (Tamil Nadu Judicial Magistrate) ఏకంగా హత్యకు యత్నించాడు.
Salem, Mar 2: తమిళనాడులోని సేలం జిల్లాలో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ను (Judicial Magistrate) కోర్టు కాంప్లెక్స్లో అతని ఆఫీస్ అసిస్టెంట్ కత్తితో పొడిచినట్లు ది హిందూ నివేదించింది. కోర్టు విధుల నుంచి బదిలీ చేశారనే ఆగ్రహంతో ఆఫీస్ అసిస్టెంట్ న్యాయమూర్తిపై (Tamil Nadu Judicial Magistrate) ఏకంగా హత్యకు యత్నించాడు. సేలం జిల్లా అస్థంపట్టిలో 24 కోర్టుల సముదాయం ఉంది. నాలుగో నేరవిభాగం కోర్టులో పొన్ పాండి న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
కేసుల విచారణ నిమిత్తం మంగళవారం ఉదయం 11 గంటలకు కోర్టుకు చేరుకోగా అక్కడే పొంచి ఉన్న ప్రకాష్ అనే ఆఫీస్ అసిస్టెంట్ అకస్మాత్తుగా ఆయన్ను కత్తితో (Judicial Magistrate attacked with knife by office assistant) పొడవబోయాడు. అప్రమత్తమైన న్యాయమూర్తి కత్తిని అడ్డుకోగా చేతికి బలమైన గాయమైంది. అక్కడే ఉన్న వారు ప్రకాష్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఓమలూరు అనే ప్రాంతంలోని కోర్టుకు ప్రకాష్ ఇటీవల బదిలీ అయ్యాడు. దీనిపై అతడు జడ్జితో గొడవపడినట్లు సమాచారం. ఈ కక్షతోనే దాడికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. న్యాయమూర్తికి స్వల్పగాయాలు కావడంతో ప్రభుత్వ మోహన్ కుమారమంగళం మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు.
హస్తంపాటి పోలీసులు ప్రకాష్పై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 307 (హత్య ప్రయత్నం) కింద కేసు నమోదు చేశారు.ఇటీవలే ఓమలూరు కోర్టు నుంచి ప్రకాష్ బదిలీ అయ్యారని, దీంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారని స్థానిక పోలీసులు ఆరోపించారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి బదిలీకి ఆదేశించారని చెప్పగా, ఆయన బదిలీకి గల కారణాలను మేజిస్ట్రేట్ను అడిగారు. అనంతరం కత్తి తీసి మేజిస్ట్రేట్పై దాడి చేశాడు.
ఈ నేపథ్యంలో మరోసారి న్యాయమూర్తుల భద్రత అంశం తెరమీదకు వచ్చింది. ధన్బాద్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ 2021 జులైలో ఉదయం నడకకు వెళుతుండగా వాహనం ఢీకొనడంతో మరణించిన తర్వాత న్యాయమూర్తుల భద్రత న్యాయవాదుల మధ్య ప్రధాన చర్చనీయాంశమైంది.
యూపీలో దారుణం, మొబైల్ ఛాటింగ్ చేస్తుందని భార్యకు ఉరివేసి చంపేసాడు, ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు
జడ్జి ఆనంద్ మరణం ప్రమాదవశాత్తు జరిగినట్లు ప్రాథమికంగా భావించినప్పటికీ, సంఘటన యొక్క CCTV ఫుటేజీ బయటపడింది, అతను రహదారి అంచున నడుచుకుంటూ వెళుతుండగా వాహనం ఉద్దేశపూర్వకంగా న్యాయమూర్తిపైకి ఢీకొట్టినట్లు సూచించింది. దీంతో న్యాయమూర్తుల భద్రతపై సుప్రింకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసింది. తదనంతరం, సెప్టెంబర్ 2021లో, రోహిణి కోర్టులో కాల్పులు జరిగాయి, గ్యాంగ్స్టర్ జితేందర్ గోగితో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు. తరువాత డిసెంబర్ 2021లో, రోహిణి కోర్టులో ఒక చిన్న పేలుడు సంభవించింది, అయితే దోషిని తరువాత అరెస్టు చేశారు. దేశ రాజధానిలోని కోర్టుల లోపల భద్రతా చర్యలను పటిష్టం చేసేందుకు ఢిల్లీ హైకోర్టు కూడా పలు ఆదేశాలు జారీ చేసింది.
(The above story first appeared on LatestLY on Mar 02, 2022 11:07 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

