Actress Disha Patani's Father Duped: నటి దిశాపటానీ తండ్రికి షాక్.. ఉన్నత పదవి ఇప్పిస్తామని రూ.25 లక్షలు మోసం చేసిన ముఠా.. ఐదుగురిపై కేసు నమోదు

ప్రముఖ సినీ నటి దిశా పటానీ తండ్రి, రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ జగదీశ్ సింగ్ పటానీకి మోసగాళ్ల నుంచి భారీ షాక్ తగిలింది. ప్రభుత్వ కమిషన్‌ లో మంచి పదవులు ఇప్పిస్తామని చెప్పి ఆయన నుంచి రూ.25 లక్షలు తీసుకున్నారు.

Actress Disha Patani's Father Duped: నటి దిశాపటానీ తండ్రికి షాక్.. ఉన్నత పదవి ఇప్పిస్తామని రూ.25 లక్షలు మోసం చేసిన ముఠా.. ఐదుగురిపై కేసు నమోదు
Actress Disha Patani's Father Duped (Credits: X)

Newdelhi, Nov 16: ప్రముఖ సినీ నటి దిశా పటానీ (Actress Disha Patani) తండ్రి, రిటైర్డ్ డిప్యూటీ ఎస్పీ జగదీశ్ సింగ్ పటానీకి మోసగాళ్ల నుంచి భారీ షాక్ తగిలింది. ప్రభుత్వ కమిషన్‌ లో (Commissions) మంచి పదవులు ఇప్పిస్తామని చెప్పి ఆయన నుంచి రూ.25 లక్షలు తీసుకున్నారు. ఇందులో రూ.5 లక్షలు నగదు రూపంలో, మిగిలిన మొత్తం బ్యాంకు ఖాతాల ద్వారా బదిలీ చేసినట్లు జగదీశ్ సింగ్ పేర్కొన్నారు. మూడు నెలలుగా తనకు పదవి ఇప్పించే అంశంపై ఎలాంటి పురోగతి కనిపించలేదని, దీంతో తాను ప్రశ్నించానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వడ్డీతో సహా తిరిగి ఇస్తామని వారు తనకు చెప్పారని వెల్లడించారు. కానీ వారు ఎంతకూ తన డబ్బును తిరిగి ఇవ్వలేదని పేర్కొన్నారు.

హైదరాబాద్‌ లోని పుప్పాలగూడలో అగ్ని ప్రమాదం.. అపార్ట్ మెంట్ లో మంటలు.. బయటకు పరుగులు తీసిన జనం (వీడియో)

ఏ పోస్టులు ఇప్పిస్తామన్నారంటే?

చివరకు తాను మోసపోయానని గుర్తించిన జగదీశ్ సింగ్ యూపీలోని బరేలి జిల్లాలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు బలమైన రాజకీయ సంబంధాలు ఉన్నాయని నిందితులు తనకు చెప్పారని, ప్రభుత్వ కమిషన్‌లో చైర్మన్, వైస్ చైర్మన్ లేదా మరో ప్రాధాన్యత కలిగిన పదవిని ఇప్పిస్తామని హమీ ఇచ్చినట్లు అందులో పేర్కొన్నారు. ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఉత్తర ప్రదేశ్‌ ఝాన్సీ జిల్లాలోని మెడికల్ కాలేజీలో ఘోర అగ్ని ప్రమాదం.. రోజుల వయసున్న పది మంది నవజాత శిశువులు సజీవ దహనం.. (వీడియో)

(The above story first appeared on LatestLY on Nov 16, 2024 09:13 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).