UP Shocker: యూపీలో ఘోరం, యువతి అరుస్తున్నా తలపై కొడుతూ మీద పడి దారుణంగా అత్యాచారం, కామాంధులు పక్కనుంచి వెళుతున్నా పట్టించుకోని పోలీసులు

మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు చేసినా కామాంధుల తీరు మారడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని లక్నో సిటీలో దారుణం చోటుచేసుకుంది. ట్యూషన్‌ నుంచి ఆటోలో ఇంటికి వెళ్తున్న 18 ఏండ్ల యువతిపై ఆటోడ్రైవర్‌, అతని స్నేహితుడు సామూహిక అత్యాచారానికి (Lucknow Teen Gang-Raped) పాల్పడ్డారు.

UP Shocker: యూపీలో ఘోరం, యువతి అరుస్తున్నా తలపై కొడుతూ మీద పడి దారుణంగా అత్యాచారం, కామాంధులు పక్కనుంచి వెళుతున్నా పట్టించుకోని పోలీసులు
Rape image (Pic Credit- PTI)

Lucknow, Oct 18: మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు చేసినా కామాంధుల తీరు మారడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని లక్నో సిటీలో దారుణం చోటుచేసుకుంది. ట్యూషన్‌ నుంచి ఆటోలో ఇంటికి వెళ్తున్న 18 ఏండ్ల యువతిపై ఆటోడ్రైవర్‌, అతని స్నేహితుడు సామూహిక అత్యాచారానికి (Lucknow Teen Gang-Raped) పాల్పడ్డారు.

యువతి ఆటో ఎక్కగానే నిందితులు ఆటోను దారి మళ్లించారు. కొత్త దారిలో ఎందుకు వెళ్తున్నారని ఆమె ప్రశ్నించడంతో తీవ్రంగా కొట్టారు. ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి మూడు గంటలపాటు ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆ తర్వాత పెట్రోల్‌ పంపులో పెట్రోల్‌ పోయించుకుని, యువతిని రోడ్డుపైకి తోసేసి (Then Left On Road) పారిపోయారు.ఆ తర్వాత అటుగా పోలీస్‌ వ్యాన్‌ రావడం గమనించిన యువతి జరిగిన సంగతి వారితో చెప్పింది. కానీ వాళ్లు తక్షణమే చర్యలు తీసుకోకుండా బాధితురాలిని ఇంటి దగ్గర దిగబెట్టారు. రేపు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయమని చెప్పి వెళ్లిపోయారు. మర్నాడు బాధితురాలు కుటుంబసభ్యులతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.

చీకట్లో బంధించి, మత్తు మందు ఇచ్చి గూగుల్ సీనియర్ మేనేజర్‌పై దారుణం, ఆ ఫోటోలతో అనంతరం రూ.40 లక్షలు ఇవ్వాలని డిమాండ్

మార్గమధ్యంలో ఆటో డ్రైవర్ వేరే దారిలో వెళ్లాడని, ఆమె అరుస్తూ, అలారం చేసినా ఆపలేదని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.తన తలపై కొట్టి, ఫోన్ లాక్కున్నారని, మూడు గంటల పాటు తమపై అత్యాచారం చేశారని ఆమె ఆరోపించింది. ఆమెను వాహనం నుండి నెట్టడానికి ముందు వారు గ్యాస్ రీఫిల్లింగ్ కోసం ఇంధన స్టేషన్ వద్ద కూడా ఆగిపోయారని బాధితురాలు ఏడుస్తూ తెలిపింది. దాంతో పోలీసులు నిందితులపై ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని సంబంధిత సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నిందితులను గుర్తించామని, తక్షణ చర్యలు తీసుకోనందుకు పోలీసు అధికారిని సస్పెండ్ చేశామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈస్ట్) ప్రాచీ సింగ్ తెలిపారు.

(The above story first appeared on LatestLY on Oct 18, 2022 04:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).