Uttar Pradesh: మళ్లీ హిజాబ్ వివాదం తెరపైకి, యూపీ హిందూ కాలేజీలోకి బుర్ఖా ధరించిన ముస్లిం విద్యార్థినులను రాకుండా అడ్డుకున్న సిబ్బంది, కాలేజీలో డ్రెస్‌ కోడ్‌ అమలు చేస్తున్నట్లు తెలిపిన ప్రొఫెసర్‌ ఏపీ సింగ్‌
Representative image (Photo Credit- File Image)

Moradabad, Jan 19: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో (Moradabad) ఓ హిందూ కాలేజీలో బురఖా ధరించిన ముస్లిం విద్యార్థినులను కాలేజీలోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఆ యువతులు నిరసనకు దిగారు. స్థానిక హిందూ కాలేజీలో చదువుతున్న ముస్లిం విద్యార్థినులు బుధవారం బురఖాలు ధరించి (Burqa UP College) కాలేజీకి వచ్చారు. అయితే వారిని క్యాంపస్‌లోకి రాకుండా (Girls Denied Entry to Hindu College) అడ్డుకున్నారు. దీంతో ఆ విద్యార్థినులు నిరసనకు దిగారు. కాలేజీ గేట్‌ వద్ద బలవంతంగా బురఖాలను తొలగించారని ఆరోపించారు.

ఇదిలా ఉంటే జనవరి నుంచి కాలేజీలో డ్రెస్‌ కోడ్‌ అమలు చేస్తున్నట్లు ప్రొఫెసర్‌ ఏపీ సింగ్‌ (Professors Say 'Uniform Implemented') తెలిపారు. డ్రెస్‌ కోడ్‌ను ఉల్లంఘించిన వారిని క్యాంపస్‌లోకి ప్రవేశించకుండా నిషేధిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో కాలేజీ డ్రెస్‌ కోడ్‌లో బురఖాను కూడా చేర్చాలని సమాజ్‌వాదీ విద్యార్థి సంఘం (ఎస్‌సీఎస్‌) స్టూడెంట్స్‌ డిమాండ్‌ చేశారు. తద్వారా బురఖా ధరించిన విద్యార్థినులను కూడా కాలేజీలోకి అనుమతించాలంటూ వినతి పత్రాన్ని సమర్పించారు.

కేరళలో హిజాబ్‌లను దహనం చేసిన ముస్లిం మహిళలు, ఇరాన్‌ ముస్లిం మహిళలకు సంఘీభావంగా కార్యక్రమం

మరోవైపు డ్రెస్‌ కోడ్‌ను కఠినంగా అమలు చేయాలని కాలేజీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గురువారం సమాజ్ వాదీ విద్యార్థి సంఘం (ఎస్‌సీఎస్‌), బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘానికి చెందిన స్టూడెంట్లు ఘర్షణకు దిగారు. ఈ పరిణామాల నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మాజీ ఎమ్మెల్యే జమీర్ ఉల్లాఖాన్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ‘బురఖాను వ్యతిరేకించే వారికి గుణపాఠం చెప్పాలి. బురఖాపై నిషేధం విధించిన వారిని నగ్నంగా ఊరేగించాలి’ అని అన్నారు. దీంతో ఈ వివాదం మరింత రాజుకుంటున్నది.

కర్ణాటకలో హిజాబ్‌ వివాదమేంటి? ఎందుకు విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నారు, కర్ణాటక హైకోర్టు దీనిపై ఏం చెబుతోంది, హిజాబ్‌ వివాదంపై పూర్తి కథనం ఇదే..

జనవరి 2022లో, కర్ణాటకలో భారీ హిజాబ్ నిరసనలు చెలరేగినప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తింది, అక్కడ రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలోని ప్రభుత్వ బాలికల పియు కళాశాలలో కొంతమంది విద్యార్థులు తమను తరగతులకు హాజరు కాకుండా నిరోధించారని ఆరోపించారు. నిరసనల సందర్భంగా, కొందరు విద్యార్థులు హిజాబ్ ధరించి కళాశాలలోకి ప్రవేశించడానికి నిరాకరించారని యువతులు పేర్కొన్నారు.ఈ ఘటనతో వివిధ కళాశాలల విద్యార్థులు కుంకుమ బొట్టు పెట్టుకుని విజయపురలోని శాంతేశ్వర్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌కు చేరుకున్నారు. ఉడిపి జిల్లాలోని పలు కళాశాలల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

విద్యార్థులు స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించిన యూనిఫాం మాత్రమే ధరించాలని, కాలేజీల్లో ఇతర మతపరమైన ఆచారాలను అనుమతించబోమని ప్రీ-యూనివర్శిటీ ఎడ్యుకేషన్ బోర్డు సర్క్యులర్ విడుదల చేసింది.ఈ విషయం కర్ణాటక హైకోర్టుకు వెళ్లింది. ఇది విద్యా సంస్థల్లో హిజాబ్‌ను నిషేధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్‌లను కొట్టివేసింది. హిజాబ్ ధరించడం ఇస్లాం యొక్క ముఖ్యమైన మతపరమైన ఆచారం కాదని పేర్కొంది.

ఆ తర్వాత కర్ణాటక హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది.హిజాబ్ నిషేధం కేసులో అత్యున్నత న్యాయస్థానం బెంచ్ విభిన్న తీర్పును వెలువరించింది. జస్టిస్ సుధాన్షు ధులియా హైకోర్టు తీర్పును పక్కన పెట్టి, తన తీర్పులో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వును రద్దు చేయగా, జస్టిస్ హేమంత్ గుప్తా అప్పీళ్లను తోసిపుచ్చారు. ఈ కేసు ఇప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తి వద్ద దిశానిర్దేశం కోసం ఉంది.ఈ కేసులో 10 రోజుల పాటు వాదనలు సాగగా, పిటిషనర్ల తరఫు 21 మంది న్యాయవాదులు, ప్రతివాదుల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్, కర్ణాటక అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవాద్గీ వాదించారు.