Haldwani Violence: హల్ద్వానీ హింసలో 4 గురు మృతి,  100 మందికి పైగా పోలీసులకు గాయాలు, షూట్‌ ఎట్‌ సైట్‌ ఆదేశాలు జారీ చేసిన సీఎం దామి, ఎవ్వర్నీ వదిలేపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి
Haldwani Violence (Photo Credit: ANI)

Nainital, February 9:ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లో గురువారం రాత్రి భారీ హింసాత్మక (Violence) ఘటనలు చోటుచేసుకున్నాయి. హల్ద్వానీలో అక్రమ కట్టడాలు కూల్చేందుకు వచ్చిన అధికారులు, పోలీసులపై స్థానికులు ఆందోళనకు దిగి దాడి చేశారు. ఈ క్రమంలో న‌లుగురు మృతిచెందారు. 250 మంది గాయ‌ప‌డ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్థానికంగా కర్ఫ్యూ విధించారు.అల్ల‌ర్లు కొన‌సాగుతున్న కార‌ణంగా ఇంట‌ర్నెట్ సేవ‌ల్ని ర‌ద్దు చేశారు. స్కూళ్లు, కాలేజీల‌ను మూసివేశారు.

కోర్టు ఆదేశాల ప్ర‌కారం అక్ర‌మంగా నిర్మించిన మ‌ద‌ర‌సాను కూల్చివేసేందుకు ప్ర‌భుత్వ అధికారులు ప్ర‌య‌త్నించారు. భారీ పోలీసు బందోబ‌స్తుతో అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లారు. మ‌ద‌ర‌సా, మ‌సీదు అక్ర‌మ స్థ‌లంలో ఉన్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. బుల్డోజ‌ర్‌తో కూల్చివేత‌కు దిగారు. అయితే జ‌నం ఒక్క‌సారిగా ఎదురుతిరిగారు. దీంతో అక్క‌డ హింస చోటుచేసుకున్న‌ది.

ఫేస్‌బుక్‌లో లైవ్‌ వీడియో మాట్లాడుతుండగా శివసేన నేత దారుణ హత్య, అభిషేక్ ఘోసల్కర్ ని కాల్చి చంపిన శత్రువులు

హింస కాస్తా ఉద్రిక్తతలకు దారితీయడంతో ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. దీంతో నిరసనకారులు పదుల సంఖ్యలో పోలీసు వాహనాలను ధ్వంసం చేసి.. పోలీస్‌ స్టేషన్‌కు నిప్పు పెట్టారు. అప్రమత్తమైన పోలీసులు హల్ద్వానీలో కర్ఫ్యూ విధించారు. ఈ ఘర్షణల్లో ఇద్దరు మృతిచెందగా.. 250 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఎక్కువ మంది పోలీసులు, మున్సిపల్‌ అధికారులే ఉన్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం అల్లర్లు అదుపులోకి వచ్చినప్పటికీ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఈ ప్రాంతంలో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. షూట్‌ ఎట్‌ సైట్‌ ఆదేశాలు జారీ చేశారు. ఘర్షణల నేపథ్యంలో హల్ద్వానీలో శుక్రవారం స్కూళ్లకు సెలవు ప్రకటించారు. దుకాణాలు మూసివేశారు. ఉత్తరాఖండ్‌ వ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించారు.

కోర్టు ఆదేశాల‌తోనే కూల్చివేత ప్ర‌క్రియ జ‌రిగిన‌ట్లు సీఎం పుష్క‌ర్ సింగ్ ధామి తెలిపారు. సంఘ‌విద్రోహ శ‌క్తులే అక్క‌డ హింస‌కు దిగిన‌ట్లు ఆయ‌న ఆరోపించారు. గ‌తంలోనే మ‌సీదు, మ‌ద‌ర‌సా ఉన్న ప్రాంతంలోని మూడు ఎక‌రాల‌ను సీజ్ చేశామ‌ని మున్సిప‌ల్ క‌మీష‌న‌ర్ పంక‌జ్ ఉపాధ్యాయ తెలిపారు. ముంద‌స్తు జాగ్ర‌త్త‌గా న‌గ‌రంలో క‌ర్ఫ్యూ విధించిన‌ట్లు అధికారులు చెప్పారు.

హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ అధ్యక్షతన శుక్రవారం అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి, బన్‌భూల్‌పురా, హల్ద్వానీలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా జరిగిన హింసాకాండకు పాల్పడిన అల్లర్లు, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలోని హింసాకాండ ప్రభావిత ప్రాంతంలో గురువారం హల్ద్వానీలోని బన్‌భూల్‌పురాలో ఆక్రమణ వ్యతిరేక డ్రైవ్ తర్వాత హింస చెలరేగడంతో భద్రతను పెంచారు.

ఇంతలో, హల్ద్వానీ హింసాకాండ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన నైనిటాల్ జిల్లా మేజిస్ట్రేట్ వందనా సింగ్ ఘటన దురదృష్టకరమని, నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సంఘటన మతపరమైనది కాదని, దీనిని మతపరమైన లేదా సున్నితమైన సమస్యగా మార్చకుండా ప్రతి ఒక్కరూ ఉండాలని సింగ్ ఉద్ఘాటించారు. ప్రతీకార చర్యలో ప్రత్యేక సంఘం ప్రమేయం లేదని ఆమె స్పష్టం చేశారు.