Vehicle Scrappage Policy: పాత వాహనాలను తుక్కుగా మార్చే వారికి గుడ్ న్యూస్, వారు కొనుగోలు చేసిన కొత్త వాహనాలకు రహదారి పన్నులో 25 శాతం వరకూ రాయితీ, ఏప్రిల్ 1 నుండి నేషనల్‌ వెహికిల్‌ స్క్రాపేజ్‌ పాలసీ అమలు
DND Flyover (Photo Credits: PTI)

New Delhi, Jan 20: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన పాత వాహనాలపై రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 1 నుంచి పదిహేనేండ్లు పైబడిన అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాహనాలను తుక్కుగా మార్చాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ నిర్ణయించింది. రవాణా కార్పొరేషన్లకు చెందిన బస్సులకు కూడా ఇదే నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసింది.కాగా 2022 ఏప్రిల్‌ 1న నేషనల్‌ వెహికిల్‌ స్క్రాపేజ్‌ పాలసీ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

రాజకీయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు వద్దు.. బలగాలకు సీఆర్పీఎఫ్ సోషల్ మీడియా ప్రత్యేక మార్గదర్శకాలు

ఈ నోటిఫికేషన్‌ ప్రకారం.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వాటి రిజిస్ట్రేషన్లను ఉపసంహరించనుంది. ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన బస్సులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం.. సైన్యం, శాంతిభద్రతలు, అంతర్గత భద్రతకు వినియోగించే వాహనాలకు మినహాయింపు ఇచ్చింది. ప్రాథమిక రిజిస్ట్రేషన్ నమోదై 15 ఏళ్లు పూర్తయిన వాహనాలను చట్టప్రకారం రిజిస్టరైన వాహన తుక్కు పరిశ్రమలకు తరలించాలని ఉత్తుర్వుల్లో తెలిపింది.

ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ, గుజరాత్ అల్లర్ల ప్రస్తావన ఉండటంతో మండిపడిన కేంద్రం, డాక్యుమెంటరీపై స్పందించిన యూకే ప్రధాని రిషి సునాక్‌

2021-22 కేంద్ర బడ్జెట్ లోనే ఈ విధానాన్ని పేర్కొంది. ఈ విధానం మేరకు వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్ల తరువాత, వాణిజ్య వాహనాలకు 15 ఏళ్ల తరువాత ఫిట్ నెస్ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలి. ఫిట్ నెస్ లభించని వాహనాలను తుక్కు కోసం ఇవ్వాల్సి ఉంటుంది. పాత వాహనాలను తుక్కుగా మార్చిన తరువాత వాటి యజమానులు కొనుగోలు చేసే కొత్త వాహనాలకు రహదారి పన్నులో 25 శాతం వరకూ రాయితీ ఇవ్వాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది.