Newdelhi, Feb 2: హర్యానాలో (Haryana) ఘోర ప్రమాదం (Accident) జరిగింది. వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా జీపు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు గల్లంతయ్యారు. ఇద్దరిని రక్షించారు. హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లా సర్దారేవాలాలో ఈ ఘోరం చోటుచేసుకుంది. దట్టంగా కురుస్తున్న మంచు కారణంగానే ప్రమాదం జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. దారి కనిపించకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. గల్లంతైన ముగ్గురి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి.
హైదరాబాద్ పాతబస్తీలో అగ్నిప్రమాదం.. సమయానికి స్పందించడంతో తప్పిన ముప్పు (వీడియో)
Haryana: 6 dead, several missing after vehicle plunges into canal in Fatehabad; search ops underway
Read @ANI Story | https://t.co/O2FbzdenrS#Haryana #Fatehabad #Vehicle #Accident pic.twitter.com/J0tDBJX5yI
— ANI Digital (@ani_digital) February 1, 2025
పెళ్లికి వెళ్లి వస్తుండగా..
పంజాబ్లోని ఫజిల్కా జిల్లాలో జరిగిన పెళ్లికి హాజరైన 14 మంది తిరిగి శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ఇంటికి తిరిగి పయనమయ్యారు. ఈ క్రమంలో సర్దారేవాలా గ్రామం వద్ద జీపు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కాలువలోకి దూసుకెళ్లింది. మొత్తం 9 మంది చనిపోయారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, 11 ఏళ్ల బాలిక ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మృతులందరూ బంధువులు, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాదం నెలకొంది.