Nuclear Scientist Rajagopala Chidambaram Passes Away: ప్రముఖ అణు శాస్త్ర‌వేత్త రాజ‌గోపాల చిదంబ‌రం (88) క‌న్నుమూత‌

ప్ర‌ముఖ అణు శాస్త్ర‌వేత్త డాక్ట‌ర్ రాజ‌గోపాల చిదంబ‌రం (88) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ముంబై లోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Nuclear Scientist Rajagopala Chidambaram Passes Away: ప్రముఖ అణు శాస్త్ర‌వేత్త రాజ‌గోపాల చిదంబ‌రం (88) క‌న్నుమూత‌
Nuclear Scientist Rajagopala Chidambaram Passes Away (Credits: X)

Newdelhi, Jan 4: ప్ర‌ముఖ అణు శాస్త్ర‌వేత్త డాక్ట‌ర్ రాజ‌గోపాల చిదంబ‌రం (88) (Rajagopala Chidambaram) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ముంబై లోని ఓ ఆస్ప‌త్రిలో (Hospital) చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాజగోపాల చిదంబ‌రం మృతి ప‌ట్ల శాస్త్ర‌వేత్త‌ల‌తో పాటు రాజ‌కీయ ప్ర‌ముఖులు నివాళులర్పించారు.

నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం.. రైతు భరోసా మీదనే ప్రధాన చర్చ.. ఇంకా ఈ విషయాలపై కూడా..

పద్మ పురస్కారాలు

అణు శాస్త్ర‌వేత్త‌గా చిదంబ‌రం తన కెరీర్ ప్రారంభించారు. పొఖ్రాన్‌-1(1975), పొఖ్రాన్‌-2(1998) అణు ప‌రీక్ష‌ల్లో రాజ‌గోపాల చిదంబ‌రం కీల‌క‌పాత్ర పోషించారు. అణుశ‌క్తి క‌మిష‌న్‌ కు చైర్మ‌న్‌ గా సేవ‌లందించారు. రాజగోపాల్ కు 1999లో ప‌ద్మ‌విభూష‌ణ్‌, 1975లో ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాలు వ‌రించాయి. భార‌త ప్ర‌భుత్వానికి శాస్త్రీయ స‌ల‌హాదారుగా ప‌ని చేశారు.

విషాదం..ప్రమాదవశాత్తూ బిల్డింగ్ పై నుండి పడి ఆర్మీ కెప్టెన్ మృతి, 4వ అంతస్తు నుండి కిందపడగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

(The above story first appeared on LatestLY on Jan 04, 2025 11:24 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).