Rajasthan Political Crisis: గుజరాత్‌, తమిళనాడును తాకిన రాజస్థాన్ రాజకీయ సెగలు, రాజ్‌భవన్‌ను ముట్టడించిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ చీఫ్ సహా 60 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

రాజస్థాన్ రాజకీయ సంక్షోభం గుజరాత్ ను తాకింది. బిజెపికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు (Congress workers) గాంధీనగర్‌లోని రాజ్ భవన్ వైపు దూసుకెళ్లారు. బీజేపీకి వ్యతిరేకంగా గుజరాత్‌ కాంగ్రెస్ చేపట్టిన ఈ నిరసన (Gujrath Congress protest) ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణకు దారితీసింది. దీంతో గుజరాత్ కాంగ్రెస్ చీఫ్ అమిత్ చావ్డా (Gujarat Congress president Amit Chavda), ప్రతిపక్ష నేత పరేశ్ ధానాని (Paresh Dhanani) సహా దాదాపు 60 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Rajasthan Political Crisis: గుజరాత్‌, తమిళనాడును తాకిన రాజస్థాన్ రాజకీయ సెగలు, రాజ్‌భవన్‌ను ముట్టడించిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ చీఫ్ సహా 60 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Gujrath Congress Protest (Photo-PTI)

Ahmedabad, Jul 27: రాజస్థాన్ రాజకీయ సంక్షోభం గుజరాత్ ను తాకింది. బిజెపికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు (Congress workers) గాంధీనగర్‌లోని రాజ్ భవన్ వైపు దూసుకెళ్లారు. బీజేపీకి వ్యతిరేకంగా గుజరాత్‌ కాంగ్రెస్ చేపట్టిన ఈ నిరసన (Gujrath Congress protest) ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణకు దారితీసింది. దీంతో గుజరాత్ కాంగ్రెస్ చీఫ్ అమిత్ చావ్డా (Gujarat Congress president Amit Chavda), ప్రతిపక్ష నేత పరేశ్ ధానాని (Paresh Dhanani) సహా దాదాపు 60 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కరోనాపై చర్చ కోసం అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయమన్న సీఎం అశోక్ గెహ్లాట్, మరింత సమాచారం కావాలని కోరిన గవర్నర్, సుప్రీంలో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్న స్పీకర్

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు సంఘీభావంగా రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని కాంగ్రెస్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గుజరాత్ కాంగ్రెస్ నేతలు ఇవాళ గాంధీనగర్‌లోని రాజ్‌భవన్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ‘‘రాజ్యాంగాన్ని, ప్రజాస్వామాన్ని కాపాడండి’’ అని రాసిన బ్యానర్లు చేతబూని.. బీజేపీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. అయితే ఈ నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు అనుమతులు తీసుకోనందున వారిని అదుపులోకి తీసుకున్నట్టు గాంధీనగర్ ఎస్పీ మయూర్ చావ్దా పేర్కొన్నారు.

మార్చ్‌కు ముందు విలేకరులతో మాట్లాడిన గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమిత్ చావ్డా, బిజెపి కేంద్ర నాయకత్వం "ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి, అధికారం కోసం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాలను కూల్చివేయడం ద్వారా ప్రజా ఆదేశాన్ని అవమానించింది" అని ఆరోపించారు.

కాగా రాజస్థాన్ గవర్నర్ కలరాజ్ మిశ్రా సోమవారం అశోక్ గెహ్లోట్ నేతృత్వంలోని ప్రభుత్వానికి అసెంబ్లీ సమావేశాన్ని కోరుతూ కేబినెట్ నోట్ ఇచ్చిన దానిపై అదనపు సమాచారం కోరింది. తొలగించిన ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మరియు మరో 18 మంది అసమ్మతి ఎమ్మెల్యేల తిరుగుబాటు తరువాత రాజకీయ సంక్షోభం ఎదుర్కొంటున్న రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకునేలా ఈ సమావేశాన్ని నిర్వహించాలని కోరుకుంటుందని సీఎం చెప్పారు. అయితే అసెంబ్లీని సమావేశం జరపకుండా గవర్నర్ "పైనుండి" ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని గెహ్లాట్ ఆరోపించారు, రాష్ట్రంలో అధికారం కోసం గొడవలో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రమేయం ఉందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణను మిశ్రా ఖండించారు.

రాజస్థాన్‌లో తలెత్తిన రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో తమిళనాడు కాంగ్రెస్ ఎంపీలు, జిల్లా కార్యదర్శులు 'సేవ్ డెమోక్రసీ అండ్ సేవ్ కాన్‌స్టిట్యూష‌న్'‌ పేరుతో ప్రదర్శన నిర్వహించారు. బీజేపీకి వ్యతిరేకంగా చెన్న‌లోని రాజ్‌‌భవన్‌కు సమీపంలో సోమవారం ఈ నిరసన ప్రదర్శన చేప‌ట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న‌ బీజేపీ చర్యలను వ్యతిరేకిస్తూ, రాజస్థాన్ ప్రభుత్వానికి మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుపాలని కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపునిచ్చిన నేపథ్యంలో తమిళనాడు కాంగ్రెస్ ఈ నిరసన ప్రదర్శన జరిపింది.

(The above story first appeared on LatestLY on Jul 27, 2020 04:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).