Hyderabad, Feb 3: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అక్షరాభ్యాసాలు, దర్శనాలతో బాసర, వర్గల్, శనిగరం తదితర ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఏటా మాఘ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే పంచమి తిథిని "వసంత పంచమి"గా వ్యవహరిస్తారు. రుతు సంబంధమైన పండగ కావడంతో దీనికి ఆ పేరు వచ్చింది. ఈ పండగనే బసంత్ పంచమి, సరస్వతీ పంచమి, మదన పంచమి, శ్రీపంచమి అనే పేర్లతో పిలుస్తారు. అందులోనూ పంచమి రోజే సరస్వతీ జయంతి కావడంతో ఈ పర్వదినానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రోజున చదువుల తల్లి సరస్వతీ అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు.

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై బన్నీ వాసు ఆరా.. అవసరమైతే విదేశాలకు తీసుకెళ్తామని వెల్లడి

Here's Video

వసంత పంచమి అమృత స్నానాలు షురూ

ఉత్తరప్రదేశ్‌ లోని ప్రయాగ్‌ రాజ్‌ లో మహాకుంభ మేళ (Maha Kumbh Mela) భక్తజన సంద్రమైంది. వసంత పంచమి సందర్భంగా త్రివేణీ సంగమంలో అమృత స్నానాలకు భక్తులు పోటెత్తారు. చివరి అమృత్ స్నానాన్ని ఆచరించేందుకు నాగా సాధవులు, స్వామీజీలు, అఖాడాలు భారీగా తరలివచ్చారు. సోమవారం తెల్లవారుజాము నుంచే చలినిసైతం లెక్కచేయకుండా పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారిపై వారిపై నిర్వాహకులు హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు.

ఏపీ సీఎం చంద్రబాబుతో తమన్‌.. గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తమన్ ట్వీట్, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫోటో