
Hyderabad, Aug 3: ఆహార నాణ్యత (Food Quality), శుభ్రత విషయంలో హైదరాబాద్ హోటల్స్ (Hyderabad Hotels) ప్రమాణాలను గాలికి వదిలేస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇప్పటికే, ప్రఖ్యాత హోటల్స్ లో మురిగిపోయిన, పురుగులు పడిన ఆహారాన్ని వడ్డించిన ఉదంతాలు బయటపడిన వేళ.. తాజాగా పంజాగుట్ట మెరిడియన్ రెస్టారెంట్ లో వడ్డించిన ఓ బిర్యానీలో బొద్దింక దర్శనమిచ్చింది. దీన్ని గమనించిన కస్టమర్ యాజమాన్యం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాడు. అయితే, హోటల్ ఓనర్ దీనిపై నిర్లక్ష్యం వహించినట్టు బాధితుడు మండిపడ్డాడు.
మిస్ యూనివర్స్ ఇండియా పోటీలకు కుప్పం యువతి చందన.. సీఎం చంద్రబాబు అభినందనలు
బిర్యానిలో బొద్దింక
పంజాగుట్ట - మెరిడియన్ రెస్టారెంట్లో బిర్యానిలో వచ్చిన బొద్దింక.. రెస్టారెంట్పై చర్యలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను కోరిన కస్టమర్.
Video Credits - @srikhande_umesh pic.twitter.com/6o06NqyY6p
— Telugu Scribe (@TeluguScribe) August 2, 2024
ఫుడ్ సేఫ్టీ అధికారులకు కస్టమర్ విజ్ఞప్తి
చిరాకెత్తిన బాధితుడు.. బిర్యానీలో బొద్దింక పడిన వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ప్రమాణాలు పాటించని మెరిడియన్ రెస్టారెంట్ పై చర్యలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ అధికారులకు కస్టమర్ విజ్ఞప్తి చేశాడు.