Bihar Horror: బీహార్లో పరువు హత్య.. చెల్లెలి ప్రియుడిని నరికి చంపి కుక్కలకు ఆహారంగా వేసిన కిరాతకుడు
సభ్య సమాజం తలదించుకునే ఘటన బీహార్లో జరిగింది. కరుడుగట్టిన నేరస్తులకు కూడా వెన్నులో వణుకు పుట్టే ఘోరం ఇది. తన సోదరి ప్రేమించిన యువకుడిని ముక్కలుగా నరికి చంపిన వ్యక్తి ఆపై ఆ భాగాలను కుక్కలకు ఆహారంగా వేశాడు.
Patna, Dec 27: సభ్య సమాజం తలదించుకునే ఘటన బీహార్లో (Bihar) జరిగింది. కరుడుగట్టిన నేరస్తులకు కూడా వెన్నులో వణుకు పుట్టే ఘోరం ఇది. తన సోదరి (Sister) ప్రేమించిన యువకుడిని ముక్కలుగా నరికి చంపిన వ్యక్తి ఆపై ఆ భాగాలను కుక్కలకు (Dogs) ఆహారంగా (Food) వేశాడు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన నలంద (Nalanda) జిల్లాలో జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బిట్టు కుమార్ అనే యువకుడు ఈ నెల 16న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో రెండు రోజుల తర్వాత 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో రాహుల్ అనే యువకుడిపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
బిట్టు తన సోదిరితో సన్నిహితంగా ఉండడం చూసి తట్టుకోలేకపోయానని, అందుకనే అతడిని మట్టుబెట్టానని చెప్పుకొచ్చాడు. ఈ నెల 16న నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి చంపేశానని అంగీకరించాడు. ఆ తర్వాత శరీరాన్ని ముక్కలుగా నరికి కుక్కలకు ఆహారంగా వేశానని, మిగతా వాటిని నదిలో పడేశానని చెప్పాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరువు హత్యే దీనికి కారణంగా తెలుస్తున్నది.
(The above story first appeared on LatestLY on Dec 27, 2022 08:33 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

