G20 Summit kicks off Today: నేడే జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశం.. సదస్సు అజెండా ఏంటి?? ఏమేం చర్చించనున్నారు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?? పూర్తి వివరాలు ఇదిగో

ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. తొలిసారి భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ సమావేశాలు ఢిల్లీ వేదికగా ఈనెల 9, 10 తేదీల్లో రెండు రోజులపాటు జరగనున్నాయి.

G20 Summit kicks off Today: నేడే జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశం.. సదస్సు అజెండా ఏంటి?? ఏమేం చర్చించనున్నారు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?? పూర్తి వివరాలు ఇదిగో
G20 Summit in Delhi (Credits: X)

Newdelhi, Sep 9: ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న జీ-20 (G-20) దేశాల శిఖరాగ్ర సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. తొలిసారి భారత్ (India) ఆతిథ్యమిస్తున్న ఈ సమావేశాలు ఢిల్లీ (Delhi) వేదికగా ఈనెల 9, 10 తేదీల్లో రెండు రోజులపాటు జరగనున్నాయి. భారత్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని.. కేంద్ర ప్రభుత్వం (Central Government) ఏర్పాట్లు చేసింది. ఢిల్లీలోని ప్రగతి మైదానంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. జీ-20లో మొత్తం 19 దేశాలు, యూరోపియన్ యూనియన్‌ కలిపి మొత్తం 20 దేశాల ప్రభుత్వాలు ప్రతినిధులుగా ఉన్నాయి. వివిధ దేశాధినేతలు, ప్రతినిధులు ఇప్పటికే జీ-20లో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులతో పాటు కేంద్ర బలగాలు నగరాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. కర్తవ్యపథ్‌, ఇండియా గేట్‌ లాంటి కీలక ప్రాంతాల్లో ప్రజల రాకపోకలను అధికారులు నిషేధించారు. వచ్చే మూడు రోజుల్లో ఢిల్లీ విమానాశ్రయ నుంచి రాకపోకలు సాగించే దాదాపు 160 దేశీయ విమాస సర్వీసులను రద్దు చేశారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు, సదస్సు జరిగే పరిసర ప్రాంతాలలో కౌంటర్-డ్రోన్ సిస్టమ్‌ను మోహరించారు.

G-20 in India: ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించిన అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఎజెండాలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాలు ఏంటంటే..

సెక్యూరిటీ భళా

అమెరికా, ప్రాన్స్, బ్రిటన్, కెనడా వంటి అగ్ర దేశాధి నేతలతోపాటు ఇతర దేశాల ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మొత్తంగా జీ 20 కూటమిలోని 20 సభ్య దేశాలు, 11 ఆహ్వాన దేశాలు, ఐరాస, ఐఎమ్ఎఫ్, ప్రపంచ బ్యాంక్ లాంటి అనేక అంతర్జాతీయ సంస్థల అధినేతలు ఈ సదస్సుకు హాజరయ్యేందుకు నిన్ననే  భారత్ చేరుకున్నారు. దీంతో ఢిల్లీలో హైసెక్యూరిటీ మోహరించారు. 5 వేల సీసీ కెమెరాలతో ఢిల్లీ మొత్తాన్ని పర్యవేక్షిస్తున్న పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.

వీడియో ఇదిగో, తొలిసారి భారత్‌కు వచ్చిన అమెరికా అధినేత జో బైడెన్‌, ఢిల్లీ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికిన కేంద్ర మంత్రి వీకే సింగ్‌

అజెండా అంశాలు ఇవే

అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణాలను పెంచడం, అంతర్జాతీయ రుణ నిర్వహణను సరళీకరించడం, క్రిప్టో కరెన్సీలపై నియంత్రణ, గ్రీన్‌ డెవలప్‌ మెంట్‌, వాతావరణ మార్పులు, వేగవంతమైన సుస్థిర అభివృద్ధి, వ్యవసాయం, ఆహార వ్యవస్థ, సాంకేతిక మార్పులు, 21 శతాబ్ధికి బహు పాక్షిక సంస్థలు, మహిళా సాధికారితతో అభివృద్ధి వంటి అంశాలే అజెండాగా జీ20 సదస్సు సాగనుందని అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

(The above story first appeared on LatestLY on Sep 09, 2023 08:28 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).