Student Paraglides To Exam Centre (Credits: X)

Mumbai, Feb 16: సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి సిటీలో భారీ ట్రాఫిక్‌ (Traffic) ను చేదించడానికి మహారాష్ట్రలోని (Maharastra) సతారా జిల్లాలో ఒక విద్యార్థి పారాగ్లైడింగ్ అనే అసాధారణమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. పసారాని గ్రామానికి చెందిన సమర్థ్ మహంగడే పరీక్ష రోజున వ్యక్తిగత పనుల కారణంగా పంచగనిలో ఉండిపోయాడు. అయితే, ఆ పనులు ఆలస్యమయ్యాయి. దీంతో వాటిని చక్కబెట్టుకునే క్రమంలో పరీక్ష సమయాన్ని కూడా సమర్థ్ మరిచిపోయాడు. అలా ఎలాగోలా ఆ పనులను పూర్తిచేశాడు. తీరా పరీక్షకు సమయం ఎంత ఉందని వాచీ చూసుకున్నాడు.

మహాకుంభమేళా రద్దీ నేపథ్యంలో ఢిల్లీ రైల్వేస్టేషన్‌ లో భారీ తొక్కిసలాట ఘటనలో 18కి చేరిన మృతుల సంఖ్య.. మరో 30 మందికి పైగా గాయాలు.. మృతుల్లో నలుగురు చిన్నారులు.. 11 మంది మహిళలు.. స్టేషన్ లో భయానక దృశ్యాలు (వీడియో)

Here's Video:

దీంతో ట్రాఫిక్ ను దాటడానికి..

పరీక్షకు 15-20 నిమిషాలు మాత్రమే మిగిలి ఉందని గ్రహించిన సమర్థ్ అసాధారణ నిర్ణయం తీసుకున్నాడు. సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలంటే ట్రాఫిక్ ను దాటాల్సి ఉంటుందని గమనించాడు. దీంతో టైమ్ దాటిపోతుండటంతో ట్రాఫిక్‌ ను తప్పించుకునేందుకు పారాగ్లైడింగ్ చేసుకుంటూ ఎగ్జామ్ హాల్ వద్దకు చేరుకున్నాడు. విద్యార్థి పారాగ్లైడింగ్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది.

దీపాదాస్ మున్షీ క్రమశిక్షణ గల నాయకురాలు..తప్పుడు ప్రచారం సరికాదన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తప్పుడు వార్తలు రాస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక