Nagpur Shocker: సెక్స్ కోసం వేధిస్తున్నాడని తొలి భర్తని కుర్చీకి కట్టేసి చంపేసింది, నాగపూర్‌లో కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేసిన యువతి, సీసీటీవీ పుటేజీ సాయంతో నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఓ భార్య తన మొదటి భర్తని దారుణంగా హత్య చేసింది. అరవై ఐదేళ్ల వయసున్న మొదటి భర్త తనను లైంగికంగా వేధిస్తుండడంతో అతడిని కుర్చీలో ( Woman ties ex-husband to chair) కట్టేసి కత్తితో గొంతు కోసి హత మార్చింది.

Nagpur Shocker: సెక్స్ కోసం వేధిస్తున్నాడని తొలి భర్తని కుర్చీకి కట్టేసి చంపేసింది, నాగపూర్‌లో కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేసిన యువతి, సీసీటీవీ పుటేజీ సాయంతో నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు
Image used for representational purpose only | (Photo Credits: PTI)

Nagpur, March 15: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఓ భార్య తన మొదటి భర్తని దారుణంగా హత్య చేసింది. అరవై ఐదేళ్ల వయసున్న మొదటి భర్త తనను లైంగికంగా వేధిస్తుండడంతో అతడిని కుర్చీలో ( Woman ties ex-husband to chair) కట్టేసి కత్తితో గొంతు కోసి హత మార్చింది. లైంగికంగా వేధించినందుకు ప్రతీకారంగా ఈ హత్య చేసినట్లు (slits his throat over harassment) పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించింది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 31 సంవత్సరాల వయస్సు గల ఒక మహిళ 65 ఏళ్ల వ్యక్తితో సహజీవనం చేసింది. మృతుడు మాజీ ESIC ఆసుపత్రి ఉద్యోగి, అతను ఐదుగురు మహిళలతో సంబంధంలో ఉన్నాడు. నిందితురాలు అతనితో సహాజీవనంలో ఉన్న నాల్గవ వ్యక్తి అని పోలీసులు తెలిపారు. కాగా మార్చి 8 న గణేశ్‌పేత్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో గొంతు కోసుకుని ఓ వ్యక్తి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.

ఆ వ్యక్తితో ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్న మహిళ అతని నుంచి విడిపోయి మరొకరితో నివసిస్తున్నట్లు పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు. ఆమె మూడు నెలల కుమారుడు ఉన్న వ్యక్తితో సహజీవనం చేస్తోంది. అయితే ఆ మహిళ వృద్ధుడితో కూడా సంబంధాన్ని కొనసాగించింది. ఆమె ఇతర బిడ్డను దత్తత తీసుకుందని చెప్పగా..కానీ ఆమె అతన్ని వదులుకోవాలని మొదటి భర్త పట్టుబట్టారు.

అమానుషం, నాలుగేళ్ల చిన్నారిపై 80 ఏళ్ల వృద్ధులు లైంగిక దాడి, పదేళ్ల జైలుశిక్ష, రూ. 50 వేల జరిమానా విధించిన పోక్సో కోర్టు, 2013లో జరిగిన దారుణ ఘటనపై తాజాగా తీర్పు ఇచ్చిన న్యాయస్థానం

ఈ నేపథ్యంలో తన పెన్షన్ ఖాతా ఎటిఎం కార్డును కూడా ఆమెను తిరిగివ్వాలని కోరాడు. దీంతో ఆ మహిళ అతన్ని చంపాలని నిర్ణయించుకుంది. అతన్ని కుర్చీకి కట్టివేసిన తరువాత, ఆమె అతని గొంతును కత్తితో కోసి, ఆ ప్రదేశం నుండి బయలుదేరే ముందు అతను చనిపోయే వరకు ఇంట్లో వేచి ఉందని పోలీసు కమిషనర్ అమితేష్ చెప్పారు.

ఈ సంఘటనకు ముందు ఆమె తన మొబైల్ ఫోన్ నుండి అతనికి కాల్ చేసి, గోకుల్‌పెత్ ప్రాంతం నుండి అతని నివాసానికి వెళ్లడానికి క్యాబ్‌ను బుక్ చేసుకున్నట్లు కనుగొనబడింది. క్యాబ్ కంపెనీ అపార్ట్ మెంట్ వద్ద ఆమె బుకింగ్ మరియు సిసిటివి కెమెరాను ధృవీకరించింది, ఆమె 90 నిమిషాల పాటు భవనం లోపల ఉందని పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు.

(The above story first appeared on LatestLY on Mar 15, 2021 04:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).