CBSE Candidates with Diabetes: డయాబెటిక్ విద్యార్థులు పరీక్ష కేంద్రానికి పండ్లు, నీళ్లు, గ్లూకోమీటర్ తెచ్చుకోవచ్చు.. సీబీఎస్ఈ కీలక మార్గదర్శకాలు
సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు రాసే డయాబెటిక్ విద్యార్థులు పరీక్ష కేంద్రానికి తమ వెంట పండ్లు, నీళ్ల బాటిల్, గ్లూకోమీటర్ తీసుకెళ్లవచ్చు. ఈ మేరకు బోర్డు వెసులుబాటు కల్పించింది. త్వరలో సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో బోర్డు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం డయాబెటిక్ విద్యార్థులు తొలుత పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలి.
Newdelhi, Feb 10: సీబీఎస్ఈ బోర్డు (CBSE Board) పరీక్షలు రాసే డయాబెటిక్ విద్యార్థులకు (Diabetic Students) బోర్డు ఊరట కలిగించింది. డయాబెటిక్ సమస్య ఉన్న విద్యార్థులు పరీక్ష కేంద్రానికి తమ వెంట పండ్లు, నీళ్ల బాటిల్, గ్లూకోమీటర్ తీసుకెళ్లవచ్చు. ఈ మేరకు బోర్డు వెసులుబాటు కల్పించింది. త్వరలో సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో బోర్డు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం డయాబెటిక్ విద్యార్థులు తొలుత పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలి. అది కూడా పాఠశాల ద్వారా దరఖాస్తు చేసుకొని సంబంధిత పత్రాలను సమర్పించాలి. తర్వాత పరీక్షలు ప్రారంభానికి ఒకరోజు ముందు పరీక్ష కేంద్రానికి వెళ్లి డయాబెటిక్ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. దీంతో అధికారులు కూడా ఏర్పాట్లు చేసుకుంటారు.
📚 **CBSE Board Exam 2024: Candidates with diabetes can carry fruits, water bottle, glucometer to test centre!**
— Live Updates🚨 (@itsliveupdate) February 10, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 10, 2024 09:48 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

