Tirumala: తిరుమల కొండపై మళ్లీ పెరిగిన భక్తుల రద్దీ.. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం.. భక్తులతో నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్
గత కొన్నిరోజులుగా తిరుమలలో తక్కువగా నమోదైన భక్తుల తాకిడి ఇప్పుడు మళ్ళీ పెరిగింది. తొలి ఏకాదశి కావడం, వీకెండ్ కూడా రావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. దీంతో శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది.
Tirumala, July 1: గత కొన్నిరోజులుగా తిరుమలలో (Tirumala) తక్కువగా నమోదైన భక్తుల (Devotees) తాకిడి ఇప్పుడు మళ్ళీ పెరిగింది. తొలి ఏకాదశి కావడం, వీకెండ్ (Weekend) కూడా రావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. దీంతో శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. టోకెన్లు (Tokens) లేకుండా క్యూలైన్లలోకి వచ్చిన భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్ మెంట్లు అన్ని నిండిపోయి, భక్తులు శిలాతోరణం వరకు క్యూలైన్లలో ఉన్నారు. నిన్న తిరుమల వెంకన్నను 62,005 మంది భక్తులు దర్శించుకోగా, 34,127 మంది తలనీలాల మొక్కు తీర్చుకున్నారు. నిన్న ఒక్క రోజే స్వామివారికి హుండీ ద్వారా రూ.3.75 కోట్ల ఆదాయం వచ్చింది.
శ్రీవాణి వీఐపీ దర్శనానికి ఏటీసీ సర్కిల్ నుంచి క్యూలో వెళ్తున్న భక్తులు
తిరుమలలో ఈరోజు రద్దీ పెరిగింది#Tirumala
Srivani VIP darshan devotees going to darshan in queue from ATC circle
Crowd increased today at Tirumala pic.twitter.com/csibtE03LS
— kshetradarshan (@kshetradarshan) July 1, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 01, 2023 09:37 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

