Attack On CM Nitish Carcade: సీఎం నితీష్ కుమార్ కాన్వాయ్పై రాళ్లదాడి, నాలుగు కార్ల అద్దాలు ధ్వంసం, 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాన్వాయ్పై రాళ్లదాడి జరిగింది. దీంతో కాన్వాయ్లోని కార్ల నాలుగు అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే ఆ కార్లలో సీఎం నితీశ్ కుమార్ (CM Nitish Kumar) లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాన్వాయ్పై రాళ్లదాడి జరిగింది. దీంతో కాన్వాయ్లోని కార్ల నాలుగు అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే ఆ కార్లలో సీఎం నితీశ్ కుమార్ (CM Nitish Kumar) లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కాగా సీఎం నితీశ్ కుమార్ నేడు గయాలో పర్యటించాల్సి ఉంది. ఆయన గయా పట్టణానికి హెలీకాప్టర్లో చేరుకోనున్నారు.
ఈనేపథ్యంలో సీఎం స్థానికకంగా తిరగడంకోసం ముఖ్యమంత్రి కాన్వాయ్లోని కార్లు ఆదివారం సాయంత్రం గయకు బయలుదేరాయి. అయితే పట్నా-గయా హైవేపై రాజధాని శివార్లలో అప్పటికే కొందరు తమ సమస్యను పరిష్కరించాలని ధర్నా చేస్తున్నారు. ఈక్రమంలో సీఎం కాన్వాయ్ అటుగా రావడంతో కోపోద్రిక్తులైన యువకులు కార్లపై రాళ్లు విసిరారు. దీంతో కాన్వాయ్లోని నాలుగు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే ఈ ఘటనలో ఎవ్వరూ గాయపడలేదు. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసులు 13 మంది నిందితులను అరెస్టు చేశారు.
Bihar | A total of 13 accused have been arrested in connection with stone-pelting at the convoy of Bihar CM Nitish Kumar yesterday: SSP Patna https://t.co/vPUyPwI32X
— ANI (@ANI) August 22, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 22, 2022 10:04 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

