Hyd, Jan 22:  హనుమకొండ (Hanumakonda) నగరం నడిబొడ్డులో పట్టపగలే ఆటో డ్రైవర్ హత్య కలకలం రేపుతోంది. ఆదాల జంక్షన్ సమీపంలో మణికొండకు చెందిన మాచర్ల రాజ్‌కుమార్‌ను మరో డ్రైవర్ కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. అతను దారుణ హత్యకు గురవుతుంటే చుట్టూ ఉన్న జనం మాత్రం చోద్యం చూస్తూ నిలబడ్డారు. పైగా హత్య జరిగే దృశ్యాలను తమ తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు.

హైదరాబాద్ - వరంగల్ ప్రధాన హైవే వద్ద ఆదాల జంక్షన్ వద్ద ఆటోలో ఉన్న సమయంలో డ్రైవర్ రాజ్‌కుమార్‌ను ప్రత్యర్ధి ఏనుగు వెంకటేశ్వర్లు తనతో తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి (Brutal Murder in Telangana) చేశాడు. ఆటోడ్రైవర్ కడుపులో దాదాపు 15 సార్లు కత్తితో పొడిచాడు.పక్కనే ఉన్న వ్యక్తులు ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ సదరు వ్యక్తి.. ఆపకుండా పదేపదే పొడిచాడు.

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియోలు ఇవిగో, లోయలో పడిన ట్రక్కు, కూరగాయలు అమ్మేందుకు వెళుతున్న 10 మంది అక్కడికక్కడే మృతి, మరో 15 మందికి గాయాలు

దీంతో ఆటోడ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆపై నిందితుడు వెంకటేశ్వర్లు వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు.ఓ మహిళ విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదమే హత్యకు కారణంగా ప్రాథమికంగా తెలుస్తోంది.

  Auto Driver Killed by another Driver 

స్థానికుల సమాచారం మేరకు సుబేదారి పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించారు. నిందితుడి కోసం పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టి అదుపులోకి తీసుకున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)