Bihar: చెత్త రిక్షాలో కరోనాతో చనిపోయిన మృతదేహం తరలింపు, బీహార్లో అమానుష ఘటన, సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన వీడియో, ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపిన అధికారులు
బీహార్లో కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని మున్సిపాలిటీ చెత్త రిక్షాలో శ్మశానవాటికకు తరలించారు. రాష్ట్రంలోని నలందా జిల్లాకు చెందిన మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఈ నెల 13న కరోనాతో మరణించాడు. అతని మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఎవరూ ముందుకు రాలేదు.
బీహార్లో కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని మున్సిపాలిటీ చెత్త రిక్షాలో శ్మశానవాటికకు తరలించారు. రాష్ట్రంలోని నలందా జిల్లాకు చెందిన మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఈ నెల 13న కరోనాతో మరణించాడు. అతని మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో నలంద మున్సిపల్ సిబ్బంది నిన్న ఆ మృతదేహాన్ని చెత్త రిక్షాలో స్మశాన వాటికకు తరలించారు. పీపీఈ కిట్లు ధరించిన సిబ్బంది అతన్ని ఖననం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. కాగా, దీనిపై నలంద సివిల్ సర్జన్ స్పందించారు. అత్యక్రియలు నిర్వహించడానికి 2 వందలకుపైగా వాహనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
A #COVID19 patient's body was carried to the crematorium on a cart of Municipal Corporation in Bihar's Nalanda yesterday. pic.twitter.com/y3iA2yjlPp
— ANI (@ANI) May 17, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 17, 2021 12:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

