మార్చి 16వ తేదీ నుంచి 12 నుంచి 14 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న వారికి కోవిడ్ టీకాల‌ను ఇవ్వ‌నున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ మ‌న్సూక్ మాండ‌వీయ ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో పాటు 60 ఏళ్లు దాటిన‌వారంద‌రికీ ప్రికాష‌న్ డోసు ఇవ్వ‌నున్న‌ట్లు కూడా ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 60 ఏళ్లు దాటి వ్యాధుల‌న్న వాళ్ల‌కు మాత్ర‌మే ఇప్ప‌టి వ‌ర‌కు కోవిడ్ ప్రికాష‌న్ టీకాలు ఇచ్చారు. నిపుణులతో మాట్లాడిన త‌ర్వాత 12 నుంచి 14 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న పిల్ల‌ల‌కు టీకాలు ఇవ్వాల‌ని కేంద్రం నిర్ణ‌యించిన‌ట్లు మంత్రి తెలిపారు. అంటే 2008, 2009, 2010 సంవ‌త్స‌రాల్లో పుటిన‌వాళ్ల‌కు ఇక నుంచి టీకాలు ఇవ్వ‌నున్నారు. 14 ఏళ్ల లోపువారికి హైద‌రాబాద్‌కు చెందిన బ‌యోలాజిక‌ల్ ఈ సంస్థ త‌యారు చేసిన కోర్బీవ్యాక్స్ టీకాను ఇవ్వ‌నున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)