దేశంలో గత 24 గంటల్లో 4.54 లక్షల మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా 16,159 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 15,394 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా 28 మంది మృతి చెందారు. మరోవైపు దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,15,212కి పెరిగింది. ముందు రోజుతో పోల్చితే యాక్టివ్ కేసులు 0.26 శాతం పెరిగాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య 4,35,47,809కి పెరిగింది. వీరిలో 4,29,07,327 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,25,270 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.53 శాతంగా, పాజిటివిటీ రేటు 3.56 శాతంగా, మరణాలు రేటు 1.21 శాతంగా, క్రియాశీల రేటు 0.26 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 198.20 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.
#COVID19 | India reports 16,159 fresh cases, 15,394 recoveries and 28 deaths in the last 24 hours.
Active cases 1,15,212
Daily positivity rate 3.56% pic.twitter.com/aHVlH7sGaE
— ANI (@ANI) July 6, 2022
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)