దేశంలో గురువారం 16,299 మందికి పాజిటివ్‌రాగా, నేడు ఆ సంఖ్య 16,561కి పెరిగింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,42,23,557కు చేరింది. ఇందులో 4,35,73,094 మంది కోలుకోగా, 5,26,928 మంది మహమ్మారితో మరణించారు. మరో 1,23,535 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 18,053 మంది కరోనా నుంచి బయటపడ్డారని, 49 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.ఇక రోజువారీ రికవరీ రేటు 5.44 శాతానికి పెరిగిందని తెలిపింది. మొత్తం కేసుల్లో 0.28 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.53 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. దేశంలో ఇప్పటివరకు 207.47 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ చేశామని ప్రకటించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)