దేశంలో కొత్త‌గా 6,358 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. నిన్న క‌రోనా నుంచి 6,450 మంది కోలుకున్నార‌ని తెలిపింది. దేశంలో ప్ర‌స్తుతం 75,456 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్నార‌ని వివ‌రించింది. రిక‌వ‌రీ రేటు 98.40గా ఉంద‌ని చెప్పింది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య (Omicron in India) రోజురోజుకీ పెరిగిపోతోంది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 653 ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వారిలో 186 మంది కోలుకున్నార‌ని వివ‌రించింది. తెలంగాణ‌లో మొత్తం 55 ఒమిక్రాన్ కేసులు న‌మోదుకాగా వారిలో 10 మంది కోలుకున్నారని తెలిపింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 6 ఒమిక్రాన్ కేసులు న‌మోదు కాగా వారిలో ఒక్క‌రు కోలుకున్నార‌ని పేర్కొంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)