Coronavirus in India: మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, కొత్తగా 13,091 మందికి కరోనా, గత 24 గంటల్లో 340 మంది మృతి, ప్రస్తుతం 1,38,556 యాక్టివ్‌ కేసులు

దేశంలో కరోనా కేసులు (Coronavirus cases) మళ్లీ పెరుగుతున్నాయి. మంగళవారం వరకు 10 వేల చొప్పున నమోదవుతూ వస్తున్న కేసులు వరుసగా రెండో రోజూ 11 వేల పైచిలుకు నమోదయ్యాయి, తాజాగా అవి 13 వేలు దాటాయి. ఇవి బుధవారం నాటికంటే 14 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ (Ministry of Health)వెల్లడించింది.

Coronavirus in India: మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, కొత్తగా 13,091 మందికి కరోనా, గత 24 గంటల్లో 340 మంది మృతి, ప్రస్తుతం 1,38,556 యాక్టివ్‌ కేసులు
Coronavirus testing | File Image | (Photo Credits: PTI)

దేశంలో కరోనా కేసులు (Coronavirus cases) మళ్లీ పెరుగుతున్నాయి. మంగళవారం వరకు 10 వేల చొప్పున నమోదవుతూ వస్తున్న కేసులు వరుసగా రెండో రోజూ 11 వేల పైచిలుకు నమోదయ్యాయి, తాజాగా అవి 13 వేలు దాటాయి. ఇవి బుధవారం నాటికంటే 14 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ (Ministry of Health)వెల్లడించింది. దేశవ్యాప్తంగా కొత్తగా 13,091 కరోనా (Covid-19) పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,44,01,670కి చేరింది.

ఇందులో 3,38,00,925 మంది కరోనా నుంచి కోలుకోగా, 1,38,556 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,62,189 మంది మృతిచెందారు. గత యాక్టివ్‌ కేసుల సంఖ్య గత 266 రోజుల్లో ఇదే కనిష్టమని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక గత 24 గంటల్లో 340 మంది మరణించాగా, 13,878 మంది కరోనా నుంచి బయటపడ్డారు. కొత్తగా కేసుల్లో కేరళలోనే సగానికిపైగా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 7,540 కేసులు నమోదవగా, 259 మంది కరోనాకు బలయ్యారు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 11, 2021 10:35 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).