National Herald Case: సోనియా గాంధీని 6 గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు, నేషనల్ హెరాల్డ్ కేసులో మళ్లీ రేపు హాజరు కావాలని తెలిపిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
సోనియాను మధ్యాహ్నం దాకా విచారించిన ఈడీ అధికారులు ఆమెకు మధ్యాహ్న భోజన విరామం ఇచ్చారు. అనంతరం విచారణను కొనసాగించిన అధికారులు... నేషనల్ హెరాల్డ్ కేసులో నిధుల గోల్ మాల్పై ప్రశ్నలు సంధించారు.
సోనియా గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మంగళవారం 6 గంటల పాటు విచారించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే ఓ దఫా విచారణకు హాజరైన సోనియా గాంధీ తాజాగా మంగళవారం మరోమారు విచారణకు హాజరయ్యారు. మంగళవారం ఉదయం కుమారుడు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంకా గాంధీ వాద్రా వెంట రాగా సోనియా గాంధీ ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు.
తమ కార్యాలయానికి వచ్చిన సోనియాను మధ్యాహ్నం దాకా విచారించిన ఈడీ అధికారులు ఆమెకు మధ్యాహ్న భోజన విరామం ఇచ్చారు. అనంతరం విచారణను కొనసాగించిన అధికారులు... నేషనల్ హెరాల్డ్ కేసులో నిధుల గోల్ మాల్పై ప్రశ్నలు సంధించారు. సాయంత్రం 6 గంటల దాకా విచారణ కొనసాగగా... 6 గంటల సమయంలో మంగళవారం నాటి విచారణ ముగిసినట్లు అధికారులు ప్రకటించడంతో సోనియా ఈడీ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లిపోయారు. మళ్లీ రేపు విచారణకు రావాలని అధికారులు తెలిపారు.
#UPDATE | Congress interim president Sonia Gandhi leaves from the ED office in Delhi after around 6 hours of questioning in the National Herald case. pic.twitter.com/3oYSVqn0pn
— ANI (@ANI) July 26, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 26, 2022 08:14 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

