Ram Navami Violence: శ్రీరామ నవమి వేడుకల్లో మత ఘర్షణలు, ముస్లిం వ్యక్తి దారుణ హత్య, ఐదుగురిని అరెస్టు చేసిన మధ్యప్రదేశ్ పోలీసులు
మధ్యప్రదేశ్లోని ఖార్గోన్లో శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణలు ఓ ముస్లిం వ్యక్తి హత్యకు దారి తీశాయి. ఈ హత్య కేసులో మధ్యప్రదేశ్ పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. ఏప్రిల్ 10వ తేదీన రాత్రి సమయంలో ఆనంద్ నగర్ – కపాస్ మండీ ఏరియాలో రెండు వర్గాల మధ్య మత ఘర్షణలు చెలరేగాయి.
మధ్యప్రదేశ్లోని ఖార్గోన్లో శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణలు ఓ ముస్లిం వ్యక్తి హత్యకు దారి తీశాయి. ఈ హత్య కేసులో మధ్యప్రదేశ్ పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. ఏప్రిల్ 10వ తేదీన రాత్రి సమయంలో ఆనంద్ నగర్ – కపాస్ మండీ ఏరియాలో రెండు వర్గాల మధ్య మత ఘర్షణలు చెలరేగాయి. ఈ క్రమంలో ఇబ్రీస్ ఖాన్(30) అనే మున్సిపల్ ఉద్యోగిపై దాడులకు పాల్పడి హత్య చేశారు. ఆ మరుసటి రోజు మృతదేహం లభ్యం కాగా, పోలీసులు ఇండోర్కు తరలించారు. ఇబ్రీస్ ఖాన్ హత్యతో ఏడుగురికి సంబంధం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. అయితే ఇబ్రీస్ ఖాన్ను మారణాయుధాలు, రాళ్లతో కొట్టి చంపారని అతని సోదరుడు పేర్కొన్నాడు. ఈ హత్యలో పోలీసుల పాత్ర కూడా ఉందని అతను ఆరోపించాడు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా జరిగిన ఘర్షణల నేపథ్యంలో 63 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
Five Arrested For Murder During Ram Navami Clashes In Madhya Pradesh https://t.co/eNOB5XukQT pic.twitter.com/9cIo7qXNEf
— NDTV News feed (@ndtvfeed) April 21, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 22, 2022 11:07 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

