Girish Chandra: నిద్రలో యూపీ మంత్రిని కొరికిన ఎలుక, పాము కాటేసిందనుకుని భయాందోళనకు యూపీ మంత్రి గిరీశ్చంద్ర యాదవ్, స్థానికంగా వుండే ఆస్పత్రికి తరలించన అధికారులు
యూపీ మంత్రి గిరీశ్చంద్ర యాదవ్కు చేదు అనుభవం ఎదురైంది. యూపీలోని బాందాలో రెండు రోజుల పాటు తన పర్యటన పూర్తి చేసుకొని ఓ విశ్రాంతి భవనంలో నిద్రిస్తున్నారు. ఈ సమయంలో ఓ ఎలుక ఆయన్ను కొరికింది. దీంతో ఆయన నిద్రలో ఉలిక్కిపడి లేచారు.
యూపీ మంత్రి గిరీశ్చంద్ర యాదవ్కు చేదు అనుభవం ఎదురైంది. యూపీలోని బాందాలో రెండు రోజుల పాటు తన పర్యటన పూర్తి చేసుకొని ఓ విశ్రాంతి భవనంలో నిద్రిస్తున్నారు. ఈ సమయంలో ఓ ఎలుక ఆయన్ను కొరికింది. దీంతో ఆయన నిద్రలో ఉలిక్కిపడి లేచారు. పాము కాటేసిందనుకొని, తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆయన్ను స్థానికంగా వుండే ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసిన తర్వాత పాము కాటు కాదని, ఎలుక కొరికిందని స్పష్టం చేశారు. దీంతో మంత్రి ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత ఆయన కాలికి పట్టీ కట్టి, డిశ్చార్జీ చేశారు.
UP Minister Girish Chandra Rushed to Hospital After Being ‘Bitten by Rat or Mole’ on Banda Tour https://t.co/WeBremxbcM
— Rohan Pankaj Sharma (@rohannsharma) May 2, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 02, 2022 04:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

