Uttar Pradesh Shocker: తల్లి శవానికి అంత్యక్రియలు చేయకుండా...ఏడాదిగా తల్లి మృతదేహంతో ఇంట్లోనే అక్కాచెల్లెళ్లు, పోలీసులు తలుపుల బద్దలు కొట్టి చూస్తే..
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ తల్లి శవంతో ఇంట్లో ఏడాది పాటు నివసించారు. అయితే గత వారం రోజులుగా ఆ అక్కాచెల్లెళ్లు ఇద్దరూ బయటకు రాకపోవడంతో పొరుగువారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
- Read in
- తెలుగు
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ తల్లి శవంతో ఇంట్లో ఏడాది పాటు నివసించారు. అయితే గత వారం రోజులుగా ఆ అక్కాచెల్లెళ్లు ఇద్దరూ బయటకు రాకపోవడంతో పొరుగువారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం ఆ ఇద్దరు మహిళల తల్లి గత ఏడాది డిసెంబర్లో చనిపోయారు.
కానీ ఆమె కూతుళ్లిద్దరూ తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించకుండా తమ ఇంట్లోనే ఒక గదిలో ఉంచి తాళం వేశారు. అయితే వారం నుంచి మృతురాలి కూతుళ్లిద్దరూ బయటకు రాకపోవడంతో పొరుగువారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తలుపులు పగలగొట్టి చూస్తే.. ఓ గదిలో మహిళ అస్థిపంజరం, మరో గదిలో అక్కాచెల్లెళ్లు ఉన్నారు. ఆ ఇద్దరి మానసిక పరిస్థితి సరిగా లేదని దర్యాప్తులో తేలింది. అయితే, తల్లి చనిపోయిన తేదీని గుర్తుంచుకోవడం కాస్త అనుమానంగా ఉందని పోలీసులు తెలిపారు. ఇద్దరినీ వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Here's TOI News
Uttar Pradesh: Two daughters found living with body of mother who died almost a year ago in Varanasi
Download the TOI app now:https://t.co/g31QN35T8f
— Rajeev Dikshit (@dikshitrTOI) November 29, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 01, 2023 12:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

