మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే తన మంత్రివర్గాన్ని విస్తరించారు. 18 మంది రాజభవన్ లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఉదయం 11 గంటలకు మంత్రులతో గవర్నర్‌ భగత్ సింగ్ కోషియారి ప్రమాణస్వీకారం చేయించారు.ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు కీలకమైన హోంశాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇంకా శాఖలను కేటాయించలేదు. మంత్రులు అయిన వారిలో బీజేపీ నుంచి తొమ్మది మంది, శివసేన నుంచి తొమ్మిది మంది ఉన్నారు.

ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ వర్గం: చంద్రకాంత్‌ పాటిల్,సుధీర్‌ మునగంటివార్, గిరీష్‌ మహాజన్, సురేశ్‌ ఖడే,  రాధాకృష్ణ విఖే పాటిల్, రవీంద్ర చవాన్, మంగళ్‌ ప్రభాత్‌ లోధా, విజయ్‌ కుమార్‌ గవిత్‌, అతుల్‌ సేవ్‌ ఉన్నారు.

ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిండే వర్గం: దాదా భుసే, శంభురాజ్‌ దేశాయ్, సందీపాన్‌ భుమరే, ఉదయ్‌ సామంత్‌, తానాజీ సావంత్‌, అబ్దుల్‌ సత్తార్, దీపక్‌ కేసర్కర్, గులాబ్‌రావ్‌ పాటిల్, సంజయ్‌ రాథోడ్‌ ఉన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)