Tamilisai Soundararajan Rejoins BJP: బీజేపీలో చేరిన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, తుత్తుకూడి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు వార్తలు
తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు రాజీనామా చేసిన రెండు రోజుల తర్వాత తమిళిసై సౌందరరాజన్ మళ్లీ బీజేపీలో చేరారు.ఆమె తమిళనాడు నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లుగా తెలుస్తోంది.
చెన్నై, తమిళనాడు | తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు రాజీనామా చేసిన రెండు రోజుల తర్వాత తమిళిసై సౌందరరాజన్ మళ్లీ బీజేపీలో చేరారు.ఆమె తమిళనాడు నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. తమిళనాడులోని తుత్తుకూడి, చెన్నై సెంట్రల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక, గత కొద్ది రోజులుగా తమిళిసై ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే
రాజీనామా అనంతరం విమానాశ్రయంలో విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై దృష్టి సారించేందుకే పదవికి రాజీనామా చేశానని అన్నారు. తెలంగాణా, పుదుచ్చేరి ప్రజల ఆప్యాయతకు రుణపడి ఉంటానన్నారు. గవర్నర్గా అవకాశం ఇచ్చిన ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని తెలిపారు. ప్రజల మధ్య ప్రత్యక్షంగా పని చేయటమే ఇష్టమని పేర్కొన్నారు. తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా, వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లుగా వార్తలు
Here's ANI Video
#WATCH | Chennai, Tamil Nadu | Tamilisai Soundararajan rejoins BJP, two days after she resigned from the posts of Telangana Governor and Puducherry Lt Governor. pic.twitter.com/S7QJuJ7iWa
— ANI (@ANI) March 20, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 20, 2024 12:11 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

