Karnataka: కర్ణాటకలో దారుణ ఘటన, మొబైల్ దొంగిలించాడని జాలరిని పడవపై తలకిందులుగా వేలాడదీశారు, కొడుతూ దొంగతనం ఒప్పుకొని, మొబైల్ తిరిగిచ్చేయాలని హింసించారు

కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో షేర్ కావడంతో అది వైరల్ అయింది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం..రోజు చేపలు పట్టుకునేందుకు జాలరుల బృందం వెళుతోంది. అయితే వారిలో ఒకరి మొబైల్ పోయింది.

Karnataka: కర్ణాటకలో దారుణ ఘటన, మొబైల్ దొంగిలించాడని జాలరిని పడవపై తలకిందులుగా వేలాడదీశారు, కొడుతూ దొంగతనం ఒప్పుకొని, మొబైల్ తిరిగిచ్చేయాలని హింసించారు
Fisherman Hung Upside Down (Photo-Video Grab)

కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో షేర్ కావడంతో అది వైరల్ అయింది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం..రోజు చేపలు పట్టుకునేందుకు జాలరుల బృందం వెళుతోంది. అయితే వారిలో ఒకరి మొబైల్ పోయింది.  దాన్ని ఈ బృందంలోని ఒక జాలరి తీశాడని మిగతా వాళ్లు ఆరోపించారు. తనకు ఎటువంటి పాపం తెలియదని, తాను దొంగతనం చేయలేదని ఆ వ్యక్తి చెప్పాడు. దీంతో కోపం తెచ్చుకున్న మిగతా వాళ్లు.. అతన్ని ఒక పడవపై తలకిందులుగా వేలాడగట్టారు. ఆపై కొట్టి దొంగతనం ఒప్పుకొని, మొబైల్ తిరిగిచ్చేయాలని హింసించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో వేలాడుతున్న వ్యక్తి, తనదేమీ తప్పులేదంటూ కాళ్లకు కట్టిన తాడును విప్పుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. మిగతా సహచరులందరూ అతని చుట్టూ నిలబడి చూస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితులైన ఆరుమందిని అరెస్ట్ చేశామని తెలిపారు.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 23, 2021 06:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).