కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో షేర్ కావడంతో అది వైరల్ అయింది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం..రోజు చేపలు పట్టుకునేందుకు జాలరుల బృందం వెళుతోంది. అయితే వారిలో ఒకరి మొబైల్ పోయింది.  దాన్ని ఈ బృందంలోని ఒక జాలరి తీశాడని మిగతా వాళ్లు ఆరోపించారు. తనకు ఎటువంటి పాపం తెలియదని, తాను దొంగతనం చేయలేదని ఆ వ్యక్తి చెప్పాడు. దీంతో కోపం తెచ్చుకున్న మిగతా వాళ్లు.. అతన్ని ఒక పడవపై తలకిందులుగా వేలాడగట్టారు. ఆపై కొట్టి దొంగతనం ఒప్పుకొని, మొబైల్ తిరిగిచ్చేయాలని హింసించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో వేలాడుతున్న వ్యక్తి, తనదేమీ తప్పులేదంటూ కాళ్లకు కట్టిన తాడును విప్పుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. మిగతా సహచరులందరూ అతని చుట్టూ నిలబడి చూస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితులైన ఆరుమందిని అరెస్ట్ చేశామని తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)