ఐపీఎల్‌-2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ బ్యాట‌ర్ రియాన్ ప‌రాగ్ అర్ధ‌సెంచ‌రీతో రాణించాడు. ఈ మ్యాచ్‌లో 31 బంతుల్లో 56 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.కాగా రాజ‌స్తాన్ ఇన్నింగ్స్ అఖ‌రి ఓవ‌ర్ వేసిన హ‌ర్షల్ ప‌టేల్ బౌలింగ్‌లో ప‌రాగ్‌ 18 పరుగులు ప‌ర‌గులు రాబాట్టాడు.అయితే హ‌ర్షల్ ప‌టేల్ వేసిన అఖ‌రి బంతికి ప‌రాగ్ భారీ సిక్స్ బాదాడు. ఈ క్ర‌మంలో రియాన్ ప‌రాగ్, హ‌ర్షల్ ప‌టేల్‌కి మ‌ధ్య మాట‌ల యుద్దం జ‌రిగింది. రాజ‌స్తాన్ ఇన్నింగ్స్‌ను ఫినిష్ చేసి పెవిలియ‌న్‌కు వెళ్తున్న‌ ప‌రాగ్‌.. హ‌ర్షల్ ప‌టేల్‌ను ఉద్దేశించి ఏదో అన్నాడు. అది విన్నహ‌ర్షల్ ప‌టేల్ పైపైకి వ‌చ్చాడు. వెంట‌నే రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌ సహాయక సిబ్బందిలో ఒక‌రు జోక్యం చేసుకుని గొడ‌వ స‌ద్దుమ‌ణిగేలా చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)