ఏపీలో గడచిన 24 గంటల్లో 29,228 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 132 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 36 కొత్త కేసులు నమోదు కాగా, విశాఖ జిల్లాలో 19 కేసులు గుర్తించారు. గుంటూరు జిల్లాలో 14, తూర్పు గోదావరి జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 1 కేసు నమోదైంది. అదే సమయంలో 186 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,75,108 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,58,817 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,823 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 14,468కి పెరిగింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)