ఏపీలో కరోనా వ్యాప్తి మరింతగా తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో 23,824 కరోనా పరీక్షలు నిర్వహించగా, 150 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 28, కృష్ణా జిల్లాలో 24, తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలలో 20 కేసుల చొప్పున నమోదయ్యాయి. అదే సమయంలో 217 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,67,706 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,49,555 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,760 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,391కి పెరిగింది.
#COVIDUpdates: 05/11/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,64,811 పాజిటివ్ కేసు లకు గాను
*20,46,660 మంది డిశ్చార్జ్ కాగా
*14,391 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 3,760#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/4BVAUlPRTa
— ArogyaAndhra (@ArogyaAndhra) November 5, 2021
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)