ఏపీలో గడచిన 24 గంటల్లో 18,601 కరోనా పరీక్షలు నిర్వహించగా... 1,597 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 478 కొత్త కేసులు నమోదు కాగా, కృష్ణా జిల్లాలో 220, గుంటూరు జిల్లాలో 144, చిత్తూరు జిల్లాలో 123, కడప జిల్లాలో 117, విజయనగరం జిల్లాలో 100, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 15 కేసులను గుర్తించారు.
అదే సమయంలో 8,766 మంది కరోనా నుంచి కోలుకోగా, 8 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి ఏపీలో ఇప్పటివరకు కరోనాతో కన్నుమూసిన వారి సంఖ్య 14,672కి పెరిగింది. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 23,05,052 మంది కరోనా బారినపడగా, వారిలో 22,27,985 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 62,395 మంది చికిత్స పొందుతున్నారు.
#COVIDUpdates: 07/02/2022, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,05,052 పాజిటివ్ కేసు లకు గాను
*22,27,985 మంది డిశ్చార్జ్ కాగా
*14,672 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 62,395#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/bWNmEi99NI
— ArogyaAndhra (@ArogyaAndhra) February 7, 2022
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)